Supreme Court: ‘మియాన్ ముస్లిం’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను నిషేధించాలి.. యోగి సహా బీజేపీ సీఎంలపై సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మియా ముస్లిం’, ‘కథా ముల్లా’, ‘వరద జిహాద్’ వంటి రెచ్చగొట్టే, విభజనాత్మక పదాలను బహిరంగ వేదికలపై ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నేతల వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది.
Read Also: NTR – Prashanth Neel’s : రూటు మార్చిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ మేకోవర్
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలాంటి పదాలను ఉపయోగించడం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల బాధ్యతలకు విరుద్ధమని, ఇది సమాజంలో విభజన, భయం, ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు సామాజిక సమరసతకు ముప్పుగా మారుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ‘మియా ముస్లిం’, ‘వరద జిహాద్’ వ్యాఖ్యలు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉపయోగించిన ‘కథా ముల్లా’ పదం, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేత నితేష్ రాణే ముస్లింలను “పాకిస్తానీ పింప్స్”గా సంబోధించిన వ్యాఖ్యలను పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పిటిషన్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ఒక వ్యాఖ్యను కూడా ప్రస్తావించారు. చరిత్రపై ప్రతీకారం తీర్చుకునేలా యువతను ప్రేరేపించే వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని పెంచుతాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సామాజిక కార్యకర్తలు జాన్ దయాల్, రూప్ రేఖ వర్మ సహా మొత్తం 12 మంది సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విభజనాత్మక వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, ఓటరు జాబితాల నుంచి మతపరమైన సమాజాలకు చెందిన వారిని తొలగించాలనే డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!