Supreme Court: ‘మియాన్ ముస్లిం’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను నిషేధించాలి.. యోగి సహా బీజేపీ సీఎంలపై సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మియా ముస్లిం’, ‘కథా ముల్లా’, ‘వరద జిహాద్’ వంటి రెచ్చగొట్టే, విభజనాత్మక పదాలను బహిరంగ వేదికలపై ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నేతల వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది.
Read Also: NTR – Prashanth Neel’s : రూటు మార్చిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ మేకోవర్
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలాంటి పదాలను ఉపయోగించడం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల బాధ్యతలకు విరుద్ధమని, ఇది సమాజంలో విభజన, భయం, ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు సామాజిక సమరసతకు ముప్పుగా మారుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ‘మియా ముస్లిం’, ‘వరద జిహాద్’ వ్యాఖ్యలు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉపయోగించిన ‘కథా ముల్లా’ పదం, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేత నితేష్ రాణే ముస్లింలను “పాకిస్తానీ పింప్స్”గా సంబోధించిన వ్యాఖ్యలను పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పిటిషన్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ఒక వ్యాఖ్యను కూడా ప్రస్తావించారు. చరిత్రపై ప్రతీకారం తీర్చుకునేలా యువతను ప్రేరేపించే వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని పెంచుతాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సామాజిక కార్యకర్తలు జాన్ దయాల్, రూప్ రేఖ వర్మ సహా మొత్తం 12 మంది సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విభజనాత్మక వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, ఓటరు జాబితాల నుంచి మతపరమైన సమాజాలకు చెందిన వారిని తొలగించాలనే డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!