మాజీ ఈజిప్షియన్ ప్రత్యేక దళాల అధికారి, అల్ ఖైదాలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉన్న సైఫ్ అల్-అదెల్ తలపై 10 మిలియన్ల డాలర్ల బహుమతిని యూఎస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్త యూఎన్ నివేదిక ప్రకారం, ఉగ్రవాద సంస్థ అల్ఖైదా కొత్త చీఫ్గా సైఫ్ అల్-అదెల్ పోటీలేని నాయకుడిగా ఉన్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్, అల్ఖైదాతో సంబంధాలున్న కొందరు అనుమానితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ముంబై, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
14 killed in two attacks in Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో 8 మంది సైన్యానికి చెందిన వారు ఉన్నారు. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఈ దాడులకు పాల్పడ్డారు. సఫీ గ్రామంలో జరిపిన దాడుల్లో ఎనిమిది మంది వాలంటీర్స ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఫాదర్ ల్యాండ్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా సైన్యానికి…
Ayman al-Zawahiri-Taliban: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని హతమార్చినట్లు స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించారు. 9/11 అమెరికా ట్విన్ టవర్స్ దాడులపై ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికా భావిస్తోంది. అమెరికన్లకు హాని తలపెట్టే ఏ ఒక్క ఉగ్రవాదిని ఉపక్షించబోం అని అమెరికా చెబుతోంది. ఇటీవల కాబూల్ లో ఆశ్రయం పొందుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా తన డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించి హతం చేసింది. రాజధా
బాల్యం నుంచే మతంపై ఆసక్తి పెంచుకున్న అల్ జవహరి.. మతపరమైన అంశాలను గమనించేవాడు. కంటి వైద్యుడైన అల్ జవహరి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం మొత్తం తిరిగాడు. సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కళ్లారా చూశాడు. ఆ సమయంలోనే యువకుడైన ఒసామా బిన్ లాడెన్ను, సోవియట్ బలగాలను ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టేందుకు సాయపడుతున్న అరబ్ తీవ్రవాద గ్రూపులను కలిశాడు.
భారతదేశ సరిహద్దులు దాటొచ్చిని ముష్కరులకు భారత భద్రత దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా.. పుల్వామాలోని ద్రాబ్గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని ఫాజిల్ నజీర్…
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. ముస్లీం దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని ఖతార్ కోరిన సంగతి తెలిసిందే! ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా ఆ వ్యాఖ్యలకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని (నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్) హతమారుస్తామని చెప్పడమే కాదు.. దేశవ్యాప్తంగా ఆత్మాహుది దాడులకు పాల్పడుతామని వార్నింగ్…
2001 ముందు వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ఖైదా ఆ తరువాత సైలెంట్ అయింది. తన ఉనికి చాటుకుంటున్నప్పటికీ పెద్దగా దాని గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 20 ఏళ్లు అ ఉగ్రవాద సంస్థ సైలెంట్గా ఉన్నది. కాగా, అమెరికా దళాలు తప్పుకోవడంతో మరలా తన ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అల్ఖైదా తిరిగి పుంజుకోవడానికి తాలిబన్లు సహకరిస్తున్నారని, పంజ్షీర్ ను వారి ఆధీనంలోకి…
ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు.…