Ayman Al-Zawahiri Kill Plan: అతనొక్కడే టార్గెట్.. తెరవెనుక ప్లాన్ ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Plan Behind Ayman Al-Zawahiri Death: 9/11 ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన ఐమన్ అల్-జవహరీని మట్టుబెట్టేందుకు అమెరికా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అతడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని ఆచూకీ కోసం స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత జవహరీ ఆచూకీ లభ్యమవ్వడంతో.. అతడ్ని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ రచించారు. తొలుత ఈ ఆపరేషన్కు జులై 25వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. అయితే.. అతడ్ని మాత్రమే చంపాలని, కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకూడదని ఈ ఆపరేషన్లో ఓ పక్కా రూల్ పెట్టుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి, ఆఫ్ఘాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్ను విజయవంతంగా చేపట్టారు.
కాబుల్లోని తన నివాసంలో జవహరీ బాల్కనీలో ఉన్నప్పుడు, రెండు హెల్ఫైర్ క్షిపణులు అతడ్ని లక్ష్యంగా చేసుకున్నాయి. టార్గెట్ కేవలం జవహర్ ఒక్కడే కాబట్టి, ఫైర్ చేయగా భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. మిగతా భవనమంతా చెక్కుచెదరలేదు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో ఉన్నది జవహరీనే అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాత దాడులకు దిగింది. ఈ ఆపరేషన్ సమయంలో జవహరీ కుటుంబ సభ్యులందరూ (భార్య, కుమార్తెలు, మనవళ్లు) ఆ భవనంలోనే ఉన్నారట! అయితే.. వారికి ఎలాంటి హానీ కలగలేదని అధికారులు పేర్కొన్నారు. జవహరీ ఉన్న అంతస్తు మాత్రమే కూలిందని, భవనానికి ఏం కాలేదని క్లారిటీ ఇచ్చారు.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
జవహరీని మట్టుబెట్టిన తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. డ్రోన్ దాడిలో అతడ్ని అంత చేశామని, 9/11 మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆయనన్నారు. ‘‘ఉద్రవాద నేత అయిన జవహరీని మట్టుబెట్టాం. ఇంకెప్పటికీ అతడు ఆప్ఘనిస్తాన్ను ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మార్చలేడు. ఉగ్రవాదులెవరూ మిగలకుండా మేం కచ్ఛితంగా ప్రయత్నిస్తాం. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 3000 మంది కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరీ మరణం ఓ ముగింపని భావిస్తున్నా’’ అని బైడెన్ అన్నారు. అనంతరం ట్విటర్లోనూ.. ‘అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే, ఎక్కడ దాక్కున్నా, ఎంత కాలమైనా కనిపెట్టి మట్టుబెడతాం’ అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!