Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు.
Canada: కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. తన డిపార్ట్మెంట్ భారత్కి ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు.
Shamshabad: కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు,
Air India: పీక్ ట్రావెల్ పిరియడ్లో ఎయిర్ ఇండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. నిర్వాహణ సమస్యల కారణంగా, ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులోని కారణంగా ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్కి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోతో పాటు అమెరికాలోని వివిధ నగరాలకు సర్వీసులు రద్దు అయ్యాయి. భారీ నిర్వహణ, సప్లై చైన్ పరిమితుల నుంచి కొన్ని…
Bomb threats: విమానయాన సంస్థలకు బూటకపు బెదిరింపులు తప్పట్లేదు. దాదాపుగా రెండు వారాలుగా దేశంలోని అన్ని ఎయిర్లైనర్లకు నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 400కి పైగా విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ఈ కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఏజెన్సీలు అత్యున్నత దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. Read Also: Triumph: ఇండియాలో…
విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
Bomb Threats To Flights: గత 10 రోజలుగా భారత విమానయాన రంగాన్ని నకిలీ బాంబు కాల్స్, మెసేజులు కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాసా ఎయిర్కి చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే.
Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి.