అటు తాలిబాన్ .. ఇటు ఇరాన్ .. మధ్యలో ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇండియా ముందుకు వచ్చింది . ఈ పోర్టుకి అనుసంధానంగా రైలు , రోడ్డు ప్రాజెక్టును నిర్మించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఇండియా ప్రణాళిక రూపొందించింది . అమెరికా సైతం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగానే స్పందించింది .
హైవే నిర్మాణం అఫ్ఘనిస్తాన్ పునర్ నిర్మాణం పేరుతో 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ – దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది . రైలు మార్గానికి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి . ఇక చబహార్ పోర్టు ప్రస్తుత సామర్థ్యం 8 మిలియన్ టన్నులు ఉండగా దాన్ని 80 మిలియన్ టన్నులకు పెంచేలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఇండియా తీసుకుంది . తద్వారా భవిష్యత్తులో పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్ – ఇండియాలు షేర్ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది .
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇరాన్పై ఆంక్షలు ప్రపంప పెద్దన్న హోదాలో న్యూక్లియర్ డీల్ విషయంలో ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా . దీంతో ఇరాన్లో ఇండియా చేపట్టిన చబహార్ పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించలేదు . కనీసం క్రేన్లు సరఫరా చేసేందుకు సైతం ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు . ఇరవై సార్లకు పైగా టెండర్లు పిలిచినా నిరాశే మిగిలింది . మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి . చబహార్ పోర్టు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ హైవే వల్ల ఇండియాకు ప్రయోజనం చేకూరి ఉండేది . కానీ అమెరికా ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రత్యక్షంగా ఇరాన్ , పరోక్షంగా ఇండియా నష్టపోయాయి . మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమైన రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పుడు చైనా ఆసక్తి చూపిస్తోంది .
చబహార్ పోర్టు పెట్టుబడి వృధాయేనా పేరుతో దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది . తాజాగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో గతంలో జరిగిన ఒప్పందాలు ఎంత మేరకు ఫలితాలను ఇస్తాయంటే సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు . మరోవైపు ఇండియా అమెరికా ట్రాప్లో పడి చబహార్ పోర్టు పనుల్లో చాలా జాప్యం చేసిందనే వాదన ఇరానీయుల నుంచి వినిపిస్తోంది . పూర్తి చేయండి అఫ్ఘనిస్తాన్ పునర్మిణం కోసం ఇండియా చేపట్టిన పనులు పూర్తి చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని , సహకారం అందిస్తామంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ పాక్ మీడియాకు వెల్లడించారు . అదే సమయంలో విదేశీ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ నేలను ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు . దీంతో గాంధర నేలపై ఇండియా పెట్టిన పెట్టుబడులు నిష్పలం అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి .
- Tags
- Afghanistan
- india
- Iraq
- talibans
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!