ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఫ్ఘాన్లోని తఖర్ ప్రావిన్స్లో బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 17 మంది బంగారు గని కార్మికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు నివేదికలు తెలిపాయి.
India wheat To Afghanista: ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది.
Earthquake: ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1.40 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 136 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 245 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పురుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని, మహిళలు ఉద్యోగం చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబాన్ నేతలు దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.
కాబూల్లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Earthquake: జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Earthquake: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూప్రకంపనలతో వణికింది. వరసగా వారం వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో 5.9 తీవ్రతలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్తాన్, ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. గురువారం రాత్రి 7.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి.