రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సర్కార్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సురేస్ ఎయిడెడ్ స్కూళ్లను తాము ప్రక్షాళన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే మూసివేస్తున్నామని.. ప్రైవేటు విద్యకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని పక్కన…
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… రెండు వేల రెండు వందలకు పైగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్ తో పని చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అని తెలిపారు. ప్రభుత్వం పలు పథకాలు అందిస్తున్నా…ఎయిడెడ్ స్కూళ్ళల్లో విద్యార్ధుల ఎన్ రోల్ మెంట్ పెరగలేదని గమనించాం. రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో ఏప్రియల్ లో కమిటిని ఏర్పాటు చేశాం. ఈ కమిటి నివేదిక కూడా ఇచ్చింది.…
త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు,…
టీడీపీ నాయకత్వం అసహనంతో ఉంది అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. ఇక “దిశ”ను అవమానించడం రాజద్రోహం కింద పరిగణించాలి అని తెలిపారు. అటువంటి వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని పేర్కొన్నారు. మహిళా హోం మంత్రిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి సంస్కారాన్ని బయటపెట్టింది అన్నారు. ఇక టీడీపీ హయాంలో మహిళలపై చాలా దాడులు జరిగాయి. మహిళలను గౌరవించే సంస్కారం వాళ్లకు లేదు అని…
ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తాం అని అన్నారు. ఇక కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు అని పేర్కొన్నారు.…
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభినందించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జాతీయ విద్యావిధానం అమలుపై పలు సలహాలు సూచనలు చేశారు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రొటెమ్ ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.…
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖలో నాడు-నేడు అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సారి కూడా విద్యార్థులకు నిరాశే మిగిలింది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్…
డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల…
రోనా మహమ్మారి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించితీరుతామని ఇప్పటికే పలు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.. తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై స్పందించిన మంత్రి.. పరీక్షలను రద్దు చేయడానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ తర్వాత పర్యావసనాలను కూడా గుర్తించాలన్నారు.. ఇక, జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే…