Atishi Marlena: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని బీజేపీ పార్టీకి సంబంధించిన గూండాలే చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయని.. ఈ దాడి బాధ్యులుగా రోహిత్ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తుల…
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపుల నుంచి ప్రాణాపాయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అయితే, దీనిపై కేజ్రీవాల్ కీలక కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘‘దేవుడే నన్ను రక్షిస్తాడు’’ అని అన్నారు. దేవుడు అనుమతించిన కాలం తాను జీవించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పటివరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఢిల్లీలోని నార్త్ వెన్యూ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి.