Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి ఊరట
- ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..
- ఈ పథకంపై కేంద్ర- రాష్ట్రాలు ఎంవోయూపై సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు.. కేంద్ర సర్కార్ కి నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జనవరి ఐదో తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని గత నెలలో ఢిల్లీలోని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా.. వాటిని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్లతో కూడిన ధర్మాసనం.. ఈరోజు (జనవరి 17) హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అలాగే, కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్పై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశ పెట్టాలని ప్రయత్నించింది. కానీ, దేశ రాజధానికి ఈ పథకం అవసరం లేదని.. ఇక్కడి ప్రజలు రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!