Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
- మరోసారి రమేష్ బిధురి వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఢిల్లీ సీఎం అతిషీపై కామెంట్స్..
- ‘‘జింక’’లా తిరుగుతుందన్న బిధురి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
ఓ ర్యాలీలో రమేష్ బిధురి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా అతిషీ ప్రజలను కలవలేదు, ఇప్పుడు ఓట్లను పొందేందుకు జింకలా తిరుగుతున్నారని అన్నారు. ‘‘ ఢిల్లీ ప్రజలు వీధుల్లో నరకం అనుభవిస్తున్నారు. అతిషీ ఎప్పుడూ ప్రజల్ని కలిసేందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో జింక అడవిలో పరిగెత్తినట్లుగా ఆమె ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
Read Also: Formula E- Race Case: లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్..
గతంలో బిధురి, అతిషీ తన తండ్రిని మార్చేసిందని వ్యాఖ్యానించారు. జనవరి 6న దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మార్లేనాగా ఉన్న అతిషీ ఇప్పుడు సింగ్ అయ్యారు. ఆమె తన తండ్రి పేరుని కూడా మార్చేసింది’’ అని అన్నారు. ‘‘ఈ మర్లెనా(అతిషీ) సింగ్ అయింది. ఆమె తన పేరు మార్చుకుంది. అవినీతిపరులైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనని అరవింద్ కేజ్రీవాల్ తన పిల్లలపై ప్రమాణం చేశాడు. మార్లేనా ఇప్పుడు తండ్రిని మార్చింది. ఇది ఆప్ నిజస్వరూపం’’ అని అన్నారు.
బిధురి వ్యాఖ్యల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అన్ని పరిమితుల్ని దాటిందని అన్నారు. బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మహిళా సీఎంని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరని, మహిళలంతా ప్రతీకారం తీర్చుకుంటారని కేజ్రీవాల్ అన్నారు. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!