Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
- మరోసారి రమేష్ బిధురి వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఢిల్లీ సీఎం అతిషీపై కామెంట్స్..
- ‘‘జింక’’లా తిరుగుతుందన్న బిధురి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
ఓ ర్యాలీలో రమేష్ బిధురి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా అతిషీ ప్రజలను కలవలేదు, ఇప్పుడు ఓట్లను పొందేందుకు జింకలా తిరుగుతున్నారని అన్నారు. ‘‘ ఢిల్లీ ప్రజలు వీధుల్లో నరకం అనుభవిస్తున్నారు. అతిషీ ఎప్పుడూ ప్రజల్ని కలిసేందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో జింక అడవిలో పరిగెత్తినట్లుగా ఆమె ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
Read Also: Formula E- Race Case: లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్..
గతంలో బిధురి, అతిషీ తన తండ్రిని మార్చేసిందని వ్యాఖ్యానించారు. జనవరి 6న దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మార్లేనాగా ఉన్న అతిషీ ఇప్పుడు సింగ్ అయ్యారు. ఆమె తన తండ్రి పేరుని కూడా మార్చేసింది’’ అని అన్నారు. ‘‘ఈ మర్లెనా(అతిషీ) సింగ్ అయింది. ఆమె తన పేరు మార్చుకుంది. అవినీతిపరులైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనని అరవింద్ కేజ్రీవాల్ తన పిల్లలపై ప్రమాణం చేశాడు. మార్లేనా ఇప్పుడు తండ్రిని మార్చింది. ఇది ఆప్ నిజస్వరూపం’’ అని అన్నారు.
బిధురి వ్యాఖ్యల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అన్ని పరిమితుల్ని దాటిందని అన్నారు. బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మహిళా సీఎంని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరని, మహిళలంతా ప్రతీకారం తీర్చుకుంటారని కేజ్రీవాల్ అన్నారు. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది.
తాజావార్తలు
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!