Delhi Elections: సీఎం అతిషి ఆస్తులు ఎంతంటే..!
- ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నామినేషన్ దాఖలు
- అఫిడవిట్లో ఆస్తులు వివరాలు వెల్లడించిన అతిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సీఎం అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తుండగా… బీజేపీ నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురి బరిలో ఉన్నారు. ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు వేశారు. తాజాగా అఫిడవిట్లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.
ముఖ్యమంత్రి అతిషి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆస్తుల విలువ రూ.76,93,347.98 ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎటువంటి స్థిరాస్తి లేదని తెలిపారు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందని వెల్లడించారు. సొంత కారు లేదా ఇతర ఎలాంటి వాహనం కూడా లేదని పేర్కొన్నారు. రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం రూ. 30 వేల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
అల్కా లాంబా…
ఇక కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా కూడా ఆస్తుల వివరాలు తెలియజేశారు. అల్కా లాంబాకు మొత్తం రూ.3.41 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమె బంధువుకి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో రూ.20.12 లక్షలు పెరిగినట్లుగా చెప్పారు. గురుగ్రామ్లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్, ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తి ఉంది. అఫిడవిట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. ఆభరణాల గురించి మాత్రం అఫిడవిట్లో వెల్లడించలేదు.
రమేష్ బిధురి…
రమేష్ సింగ్ బిధురి.. కల్కాజీ నుంచి బరిలో ఉన్నారు. 2003, 2008, 2013లో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్లో ఉండి 2019లో కాంగ్రెస్లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్జెండర్ ఓటర్లున్నారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!