IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచకప్లో విరాట్ విఫలం
- 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు
- ఇలా ఆడటం కూడా మంచిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024లో రాణించడం లేదు. 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
టీ20ల్లో తక్కువ స్ట్రైక్రేట్తో విరాట్ కోహ్లీ పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. నేడు సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విక్రమ్ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘అఫ్గానిస్థాన్పై విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం నాకు సంతోషంగా అనిపించలేదు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్లో సవాళ్లు విసిరే పిచ్లపై ఇలా ఆడటం కూడా మంచిదే. బంగ్లాపై విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్కు భారీ అడ్డంకి!
‘భారత్లో ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు.. ఇక్కడ రాణించడం శుభ పరిణామం. రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఉంటుంది. అత్యుత్తమ టీమ్తోనే బరిలోకి దిగుతాం. అక్షర్ పటేల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించడం సానుకూలాంశం. న్యూయార్క్లో దారుణమైన పిచ్లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్నాం. బంగ్లాను తక్కువగా అంచనా వేయడం లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టు ఉన్నారు. టీ20 క్రికెట్లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది. విజయం ఎప్పుడైనా తారుమారవుతుంది. పొట్టి క్రికెట్లో జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని భారత బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!