IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచకప్లో విరాట్ విఫలం
- 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు
- ఇలా ఆడటం కూడా మంచిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024లో రాణించడం లేదు. 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
టీ20ల్లో తక్కువ స్ట్రైక్రేట్తో విరాట్ కోహ్లీ పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. నేడు సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విక్రమ్ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘అఫ్గానిస్థాన్పై విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం నాకు సంతోషంగా అనిపించలేదు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్లో సవాళ్లు విసిరే పిచ్లపై ఇలా ఆడటం కూడా మంచిదే. బంగ్లాపై విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్కు భారీ అడ్డంకి!
‘భారత్లో ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు.. ఇక్కడ రాణించడం శుభ పరిణామం. రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఉంటుంది. అత్యుత్తమ టీమ్తోనే బరిలోకి దిగుతాం. అక్షర్ పటేల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించడం సానుకూలాంశం. న్యూయార్క్లో దారుణమైన పిచ్లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్నాం. బంగ్లాను తక్కువగా అంచనా వేయడం లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టు ఉన్నారు. టీ20 క్రికెట్లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది. విజయం ఎప్పుడైనా తారుమారవుతుంది. పొట్టి క్రికెట్లో జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని భారత బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!