IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచకప్లో విరాట్ విఫలం
- 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు
- ఇలా ఆడటం కూడా మంచిదే
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024లో రాణించడం లేదు. 4 మ్యాచ్ల్లో కలిపి 29 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గాన్తో జరిగిన మ్యాచ్లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
టీ20ల్లో తక్కువ స్ట్రైక్రేట్తో విరాట్ కోహ్లీ పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. నేడు సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విక్రమ్ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘అఫ్గానిస్థాన్పై విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్గా మలచకుండా ఔట్ కావడం నాకు సంతోషంగా అనిపించలేదు. అయితే గత మ్యాచ్లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్లో సవాళ్లు విసిరే పిచ్లపై ఇలా ఆడటం కూడా మంచిదే. బంగ్లాపై విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్కు భారీ అడ్డంకి!
‘భారత్లో ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు.. ఇక్కడ రాణించడం శుభ పరిణామం. రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఉంటుంది. అత్యుత్తమ టీమ్తోనే బరిలోకి దిగుతాం. అక్షర్ పటేల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించడం సానుకూలాంశం. న్యూయార్క్లో దారుణమైన పిచ్లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్నాం. బంగ్లాను తక్కువగా అంచనా వేయడం లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టు ఉన్నారు. టీ20 క్రికెట్లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది. విజయం ఎప్పుడైనా తారుమారవుతుంది. పొట్టి క్రికెట్లో జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని భారత బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!