Gavaskar: జట్టులో వికెట్లు తీసేవారు లేకపోవడమే లోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రెండు మ్యాచుల్లో కట్టడిగా బౌలింగ్ చేయగలిగాడు. అంతేకాదు ఎక్కువ వికెట్లు తీసింది కూడా ఇతడే. ముఖ్యంగా రెండో టీ20లో నాలుగు ఓవర్లకు నాలుగు వికెట్లు తీశాడు. అయినా మిగిలిన బౌలర్లలో పస లేకపోవడంతో దక్షిణాఫ్రికా ఉతికి ఆరేసింది.
దీంతో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్లో టీమ్ఇండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని ఆయన అభిప్రాయపడ్డారు. కటక్ వేదికగా గతరాత్రి జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమిపాలవ్వడంపై బ్యాటింగ్ దిగ్గజం స్పందించారు. భారత జట్టులో వికెట్లు తీసే వారు లేకపోవడం లోటుగా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నట్టు చెప్పారు.
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
‘‘భారత స్క్వాడ్ లో వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే సమస్య. భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ మాత్రమే మినహాయింపు. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేయగలవు. రెండు మ్యాచుల్లోనూ భువనేశ్వర్ కుమార్ మినహా మరెవరు అయినా వికెట్ తీసినట్టు కనిపించారా? 211 పరుగులు చేసి కూడా ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోవడం వెనుక సమస్య ఇదే’’అని గవాస్కర్ వివరించారు. తాను చూడ్డానికి ఇష్టపడే ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, ఉమ్రాన్ మాలిక్ అని గవాస్కర్ చెప్పారు. భారత జట్టు వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్లో తలపడనుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!