Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.…
IND vs AUS: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్లో తన సత్తా చాటింది. ఈ విజయోత్సాహం మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2025-26 ఇంటర్నేషనల్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 19 నుంచి నవంబర్…
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో హారిస్ రౌఫ్ ఫీల్డింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది.
IND vs ENG: ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ప్రారంభించింది. ఇక కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్లో కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో విజయం నమోదు చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. Also Read: Noman Ali: వయసనేది జస్ట్…
IND vs ENG: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్లో తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ…
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక చేసింది. జనవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి షమీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. టీ20 జట్టు నుంచి రిషబ్ పంత్ను తప్పించారు. అలాగే... ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు…
Kusal Perera: కొత్త సంవత్సరం 2025లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే కుశాల్ పెరీరా ధాటిగా ఆడి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తన తుఫాన్ సెంచరీతో జట్టుకు సంవత్సరంలో మొదటి రోజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీ కుశాల్ పెరీరాకు అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. కేవలం 44 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి, 219.56 స్ట్రైక్ రేట్తో.. 13 ఫోర్లు, 4 సిక్సర్ల…
West Indies vs Bangladesh: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో ఆతిథ్య జట్టును 80 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ముందుగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టీ20లో బంగ్లాదేశ్ వెస్టిండీస్కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, వెస్టిండీస్ 109 పరుగులకు మించి…
IND W vs WI W: వెస్టిండీస్తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20…
బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడనుంది.