Team India: సిరీస్ ప్రారంభానికి ముందే భారత్కు షాక్.. కెప్టెన్ అవుట్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో మంచి ఫామ్ను కనపరిచిన రాహుల్ జట్టుకు దూరం కావడం ఊహించని పరిణామం. కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్కు బీసీసీఐ జట్టు పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్కు మిథాలీరాజ్ గుడ్బై
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
మరోవైపు వైస్ కెప్టెన్ బాధ్యతలను హార్డిక్ పాండ్యా నిర్వర్తించనున్నాడు. కాగా సిరీస్ మొత్తానికి కేఎల్ రాహుల్ దూరమైనట్లు సమాచారం అందుతోంది. అతడితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రస్తుతానికి ఎవరినీ తీసుకోలేదు. అయితే ఈ సిరీస్కు ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..