IPL 2026-BCCI: ఐపీఎల్లో సంచలనం.. క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాలు.. సమాచార లీక్పై బీసీసీఐ సీరియస్!
- ఐపీఎల్ 2026 సీజన్లో వెలుగులోకి సంచలన విషయం
- క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాలు
- సమాచార లీక్పై బీసీసీఐ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026Cricketer’s Girlfriend Allegedly Leaks Team Information: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఐపీఎల్ క్రికెటర్ గర్ల్ఫ్రెండ్ జట్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేస్తూ.. రెండుసార్లు పట్టుబడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన ఫ్రాంచైజీ యజమాని వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హనీట్రాప్ ఉచ్చులో పడకుండా ఆటగాళ్లను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేసింది.
బీసీసీఐ అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. అలాగే జట్టు బస చేసే హోటల్లోనే ఉండాల్సి ఉంటుంది. బీసీసీఐ ఈ నిర్ణయానికి కారణం కొన్ని జట్లలోని అవకతవకలేనని నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు ప్లేయర్స్, జట్టు అధికారులు అనధికార వ్యక్తులతో నాన్-డిజిగ్నేటెడ్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ గుర్థించినట్లు తేలింది. ఇది లీగ్ సమగ్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఓ క్రికెటర్ గర్ల్ఫ్రెండ్ జట్టు వ్యూహాలకు సంబంధించిన సమాచారం బయటకు చేరవేసిన ఘటన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలవరపరిచిందని సమాచారం.
Also Read
- RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
- IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
- BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
- IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్ 2026లో కొన్ని ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల ప్రవర్తనలో అసాధారణ పరిస్థితులు గమనించాం. జట్టు సభ్యులతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారు. కొందరు హోటళ్లకు, ఆటగాళ్ల గదులకు కూడా వస్తున్నారు. ఇది పూర్తిగా యాంటీ కరప్షన్ నిబంధనలకు విరుద్ధం’ అని తెలిపారు. అంతేకాకుండా కొన్ని జట్టు యజమానులు, అధికారులు కూడా అనుమతి లేని ప్రాంతాల్లో ఆటగాళ్లతో కలుస్తున్నారని బీసీసీఐ గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నామని, ఇకపై నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని హెచ్చరించారు.
ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే.. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంటుంది అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాడు లేదా సిబ్బందిపై షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత పదార్థాల వినియోగం, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే.. చట్టపరంగా పోలీసు కేసులు కూడా నమోదయ్యే అవకాశముందని దేవజిత్ సైకియా హెచ్చరించారు. క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాల నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో భద్రత, గోప్యత, యాంటీ కరప్షన్ నిబంధనల అమలుపై బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరించనుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తాజావార్తలు
-
IPL 2026-BCCI: ఐపీఎల్లో సంచలనం.. క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాలు.. సమాచార లీక్పై బీసీసీఐ సీరియస్!
-
Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
-
Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
-
CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!