IPL 2025: స్టేడియంలోకి వెళ్లి కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. సీక్రెట్స్ వెల్లడి..!
- గ్రౌండ్లోకి వెళ్లి కోహ్లీని హగ్ చేసుకున్న ఓ అభిమాని
- తాజాగా సీక్రెట్ వెల్లడించిన రీతుపర్ణో పఖిరా
- నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగారు
- అనంతరం వేగంగా పారిపో అని చెప్పారు- రీతుపర్ణో పఖిరా
- భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు- అభిమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో 18 ఏళ్ల యువకుడు రీతుపర్ణో పఖిరా అనే యువకుడు కోహ్లీని కలవడానికి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా.. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లోకి వచ్చాడు. కోహ్లీ దగ్గరికి వచ్చి అతని పాదాలను తాకాడు. అంతేకాకుండా.. కోహ్లీని పైకెత్తి కౌగిలించుకున్నాడు. యువకుడు గ్రౌండ్ లోకి రావడం చేసి వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్లారు. అతన్ని తీసుకెళ్లే ముందు.. కోహ్లీ అతనిని ఏమొనద్దని సూచించాడు. “నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, ‘జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)’ అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు” అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
కాగా.. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 59 పరుగులు (36 బంతుల్లో, నాటౌట్) చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ప్రారంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫిల్ సాల్ట్ (56 పరుగులు, 31 బంతుల్లో)తో కలిసి కోహ్లీ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వారి అద్భుతమైన బ్యాటింగ్తో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని చేధించి.. కోల్కతాపై గత నాలుగు పరాజయాలకు ముగింపు పలికింది.
Read Also: Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోవడంపై సిరాజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 174/8 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్ బ్యాటర్లను పెవిలియన్కు పంపించాడు. 4 ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో.. కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.
తాజావార్తలు
-
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
-
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
-
Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
-
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
-
Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ట్రెండింగ్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..