INDvsAUS : నాలుగో టెస్ట్ డ్రా.. సీరిస్ కైవసం చేసుకున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరు అనుకున్నట్టుగానే ఎలాంటి హైడ్రామా లేకుండా అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటికే మూడో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా.. న్యూజిలాండ్ చేతుల్లో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా కూడా ఫైనల్ కు అర్హత సాధించింది.
Also Read : Ys Sunitha Reddy: సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్… కీలక అంశాలు
Also Read
- Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
- James Hopes: "గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం".. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
- Kumar Sangakkara: "వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను".. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఓవర్ నైట్ స్కోర్ 3/0 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా .. 78.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా కంటే 84 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ జట్టు ఉంది. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన మథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి అవుట్ కాగా ట్రావిస్ హెచ్ 163 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సీరిస్ మొదటి మూడు టెస్టుల్లో, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన ఐసీసీ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 2 పోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
Also Read : Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట
పిచ్ ఎంతకీ బౌలర్లకు సహకరించకపోవడంతో పూర్తి ఓవర్ల పాటు ఆడినా వృథాయేనని భావించిన ఇరు జట్ల కెప్లెన్లు డ్రాకి అంగీకరించారు. ఎంతకీ వికెట్లు పడకపోవడంతో శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పూజారాలతో కూడా బౌలింగ్ రోహిత్ శర్మ చేయించాడు. శుబ్ మన్ గిల్ 79వ ఓవర్ లో ఓ బాల్ వేసిన తర్వాత రోహిత్, స్టీవ్ స్మిత్ తో మాట్లాడి డ్రాకి ఒప్పించడంతో మ్యాచ్ ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులకి ఆలౌట్ అయింది. ఓపెనర ఉస్మాన్ ఖవాజా 180 పరుగుల చేయగా కామెరూన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీశాడు. బదులుగా టీమిండియా తొలి ఇన్సింగ్ లో 571 పరుగులకీ ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయగా శుభ్ మన్ గిల్ 128 రన్స్ చేశాడు.
Also Read : Top Headlines @5PM: టాప్ న్యూస్
తన కెరీర్ లో ఆరు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి డ్రా.. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్ శర్మ, ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవిచూశాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఇండియా-ఆసీస్ జట్లు అర్హత సాధించాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ లో టైటిల్ ఫైట్ లో పాల్గొంటాయి. ఇంగ్లాండ్ లో ది ఓవల్ లో జూన్ 7 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..