Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- జార్ఖండ్ విద్యార్ధి ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్..
- 14వ JPSC పరీక్షను రద్దుకు సిద్ధం..
- సీబీఐ విచారణకు హామీ ఇవ్వాలని విద్యార్థుల అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Protest: పేపర్ లీక్పై విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి జార్ఖండ్ సర్కార్ దిగొచ్చింది. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం మరోసారి విద్యార్థులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. అయినప్పటికీ JPSC-JSSC పరీక్షల రద్దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీబీఐ దర్యాప్తుపై హామీ ఇచ్చేంత వరకు రాజీ ప్రసక్తే లేదని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు.
విద్యార్ధులతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 14వ JPSC పరీక్షను రద్దు చేయడం, పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై దర్యాప్తు చేయడం, నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనల్ని విద్యార్థులు పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తు లేకుండా చేసే ఇతర దర్యాప్తులు చేయడం, సీజీఎల్ పరీక్షను రద్దు చేయకపోవడం తమ ప్రధాన సమస్యల్ని పరిష్కరించవని విద్యార్థులు స్పష్టం చేశారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
విద్యార్థులు చేస్తు్న్న డిమాండ్లలో 99 శాతం అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు. మూడు రోజుల చర్చల తర్వాత 14వ JPSC పరీక్షతో పాటు 2023-25 బ్యాక్లాగ్ నియామకాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై రెండు దిశల్లో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమినల్ అంశాలను రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేస్తుందని, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కోరుతామని మంత్రి తెలిపారు. నిందితులపై 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్ నియామకాలపై నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!