Ys Sunitha Reddy: సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్… కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. వైఎస్ వివేకా తనయ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరి తో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయి.సునీల్ యాదవ్ గూగుల్ టెకౌట్ లొకేషన్ ఆధారంగా హత్య కు ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ పలుమార్లు వెళ్ళాడు. 2017 ఎం ఎల్ సి ఎన్నికలలో వివేకా ని కావాలనే ఓడించారు. 2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకా కు టికెట్ ఇస్తున్నారననే సమాచారం తో హత్య చేశారు. హత్య గురించి అవినాష్ రెడ్డి కి ముందే తెలుసు అని ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
హత్య చేశాక అందరిని అవినాష్ కాపాడుకుంటాడాని ఎర్ర గంగి రెడ్డి మిగిలిన నిందితులకు చెప్పాడు.వివేకా మరణం వార్త ను మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచి చూశారు.రాజశేఖర్ రెడ్డి తమ్ముడు శివ ప్రకాష్ రెడ్డి వివేకా మరణ వార్తను అవినాష్ కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి 2 నిమిషాల్లోనే వివేక ఇంటికి వెళ్లారు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, తదితరులు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ అవినాష్ రెడ్డి ఇంట్లో చూపించింది. వివేకా ఇంటికి వచ్చిన శశికళ కి గుండె పోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడు. పోలీసులకు సైతం వివేకా గుండె పోటుతో పాటు, రక్తపు వాంతులతో చనిపోయినట్లు చెప్పాడు. హత్య కాదు , సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గంగాధర్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కీలక అంశం బయట పడింది. వివేకా ను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్మెంట్ ఇచ్చాడు
మాజీ సీఐ శంకరయ్య స్టేట్మెంట్ కీలకంగా మారింది. వివేకా గుండె పోటుతో చనిపోయాడని స్వయంగా అవినాష్ కాల్ చేసి చెప్పాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. విచారణకు సహకరించకుండా అవినాష్ రెడ్డి కోర్టులలో తప్పుడు కేసులు వేస్తున్నాడు. ఆధారాలు లేని ఆరోపణలు నాపై, నా కుటుంబం పై అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు. పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ అధికారులు వారి పలుకుబడి ఉపయోగించి అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారు.సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణ రెడ్డి, గంగాధర్ రెడ్డి లతో తప్పుడు ఆరోపనలు చేస్తూ సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారు.అవినాష్ విచారణ సందర్భంగా ఆడియో , వీడియో అవసరం లేదు. నామీద నా కుటుంబం మీద ఆరోపణలు చేశారు కాబట్టే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాను.
Read Also: Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?