Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కీలక ఆటగాళ్ల వరుస గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల వంటి ప్రధాన ఆటగాళ్లు పునరావాసం (రిహాబ్) పూర్తి చేసుకుని జట్టులోకి వచ్చాక మళ్లీ గాయపడటంతో బిసిసిఐకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్ పరీక్షల ప్రమాణాలు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ పనితీరు, జాతీయ సెలెక్టర్ల మధ్య సమన్వయ లోపంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ను కలసి ఆటగాళ్ల కోలుకునే ప్రక్రియను సమీక్షించారు.
ఈ విమర్శలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ, విమర్శలను తిరస్కరించారు. గాయాలు అనేవి ఏ క్రీడాకారుడి కెరీర్లోనైనా ఒక సహజమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులెవరో తేల్చి ‘బలిపశువు’ కోసం వెతకడం సరికాదని, ఎవరినీ నిందించకుండా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థపైనే దృష్టి పెట్టాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కేవలం గాయాల నుంచి కోలుకునే స్థానం మాత్రమే కాదని, క్రీడాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో దీని పాత్ర చాలా పెద్దదని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
ప్రస్తుతం భారత్కు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా మోకాళ్ల వాపుతో బాధపడుతుండగా,సాయి సుదర్శన్ కాలిన వేలి గాయంతో, హర్షిత్ రాణా , నితీష్ కుమార్ రెడ్డి కండరాల పట్టేత (మజిల్ స్ట్రెయిన్) సమస్యతో, వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో మైదానానికి దూరమయ్యారు. వీటితో పాటు ఆటగాళ్ల రీ-ఎంట్రీ గడువు, ఫిట్నెస్ ప్రమాణాల విషయంలో సెలెక్షన్ కమిటీకి, CoE కి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకముందే కొంతమందిని మ్యాచ్లకు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, నిందలు వేసుకోవడం కంటే ఆటగాళ్ల గాయాల నిర్వహణను మరింత మెరుగుపరచడమే ప్రస్తుత లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!