ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ మ్యాచ్లు ఎప్పుడంటే..?
- రేపటి నుంచే ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ..
- మర్చ్ 9వ తేదీ వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా మ్యాచ్లు..
- ఈ నెల 23న దుబాయ్ వేదికగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇదే..
Read Also: Fake IT Jobs: ఫేక్ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి యువతను మోసం చేసిన నిందితుడు అరెస్ట్
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్..
గ్రూప్-A: పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
గ్రూప్-B: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్
అన్ని మ్యాచుల షెడ్యూల్..
ఫిబ్రవరి 19, పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ, పాకిస్తాన్
ఫిబ్రవరి 20, బంగ్లాదేశ్ v భారతదేశం, దుబాయ్
ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా, కరాచీ, పాకిస్తాన్
ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
ఫిబ్రవరి 23, పాకిస్తాన్ v భారతదేశం, దుబాయ్
ఫిబ్రవరి 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 25, ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 26, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
ఫిబ్రవరి 27, పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 28, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, లాహోర్, పాకిస్తాన్
మార్చి 1, దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, కరాచీ, పాకిస్తాన్
మార్చి 2, న్యూజిలాండ్ v ఇండియా, దుబాయ్
మార్చి 4, సెమీ-ఫైనల్ 1, దుబాయ్
మార్చి 5, సెమీ-ఫైనల్ 2, లాహోర్, పాకిస్తాన్
మార్చి 9, ఫైనల్ ( భారతదేశం అర్హత సాధించకపోతే లాహోర్ లో జరుగుతుంది.. ఇండియా అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది)
ఇక, మార్చి 10, రిజర్వ్ డేగా ఐసీసీ ప్రకటించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే అన్ని మ్యాచ్లు డే-నైట్ మ్యాచ్లుగా ఉంటాయని తెలిపింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 2:00 గంటలకు పడనుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..