NZvsSL: కివీస్ ను ఆదుకుని.. భారత్ కు ఆశలు కల్పించిన మిచెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్ట్ చర్చ్ వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలుత తడబడ్డా కివీస్ తర్వాత పుంజుకుంది. డారిల్ మిచెల్ అద్బుత సెంచరీకి తోడు లోయరార్డర్ లో హెన్రీ రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్ లో లంక కంటే ఎక్కువ స్కోరు న్యూజిలాండ్ జట్టు చేసింది. డారెల్ మిచెల్(102) చేయగా హెన్రీ ( 75 బంతుల్లో 72, 10 ఫోర్లు, 3సిక్సర్లు) వన్డే తరహా ఆట ఆడారు. ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 162-5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన కివీస్ జట్టును మిచెల్ ఆదుకున్నాడు. మైఖేల్ బ్రాస్ వెల్ (25) నిరాశపరిచాడు. కెప్టెన్ టీమ్ సౌథీ (25) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు.
Aslo Read : Obesity : కొవ్వు తగ్గాలంటే కొన్నింటికి దూరంగా ఉండాల్సిందే.. వాటిలో మెయిన్ ఇవే
Also Read
- BCCI Review: గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ సమీక్ష.. షాకింగ్ నిర్ణయాలు ఏమైనా ఉంటాయా?
- IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
- BCCI: "చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు".. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
- England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. హన్రీ వచ్చిన తర్వాత మిచెల్ కూడా స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ 9వ వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డారెల్ మిచెల్ ఔటైయ్యే సమయానాకి న్యూజిలాండ్ 291-8గానే ఉంది కానీ హెన్రీ మెరుపులతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో లంక స్కోరు (3550ను దాటేసింది. చివర్లో వాగ్నర్ (24బంతుల్లో 27, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 373 పరుగులు చేయగలిగింది. ఫలితంగా మొదటి ఇన్సింగ్స్ లో 18 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని న్యూజిలాంట్ టీమ్ సాధించింది.
Aslo Read : Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు
కాగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక.. ఇప్పటికే మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(28), దిముత్ కరుణరత్నే(17)లు విఫలమయ్యారు. వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(14) కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్( 20 నాటౌట్), ప్రభాత్ జయసూర్య(2నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 38ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసి 65 పరుగుల లీడ్ సాధించింది.
Aslo Read : India’s services sector: ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ
కాగా, భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ చేరాలంటే లంక-కివీస్ లటెస్ట్ మ్యాచ్ ఫలితం కూడా కీలకంగా మారింది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడితే.. లంకకు డబ్య్లూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలుంటాయి. కివీస్ ను రెండు మ్యాచ్ లలో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీస్ చేస్తే లంకేయులు ఫైనల్ కు చేరుతారు. ప్రస్తుతం ఈ టెస్టులో శ్రీలంక గెలవడం కొంచెం కష్టమే.. ఈ నేపథ్యంలో మిచెల్ కివీస్ తో పాటు భారత జట్టను ఆదుకున్నటే.. ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలుపు సంగతి దేవుడెరుగు కానీ మ్యాచ్ ను కనీసం డ్రా చేసుకున్నా అదే పదివేలు అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
-
BCCI Review: గంభీర్ భవితవ్యంపై బీసీసీఐ సమీక్ష.. షాకింగ్ నిర్ణయాలు ఏమైనా ఉంటాయా?
-
Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!