IND vs AUS 1st ODI: భారత బౌలర్ల తాండవం.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Team Got Out For 188 Againt India In First ODI: వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు 188 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదట్లో నిలకడగా రాణించగలిగింది కానీ, ఆ తర్వాతే పట్టు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే 81 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్రీజులో ఉన్నంతవరకు పరుగుల వర్షం కురిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లెవరూ సత్తా చాటలేకపోయారు. మైదానంలోకి అడుగుపెట్టినట్టే పెట్టి.. పెవిలియన్ బాట పట్టారు. ఒకరిద్దరు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించారు కానీ, ఆ తర్వాత వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీంతో.. 35.4 ఓవర్లలోనే 188 పరుగులకి ఆసీస్ జట్టు చాపచుట్టేసింది.
DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. అయితే.. ఆదిలోనే ఆసీస్ జట్టుకి గట్టి దెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ జట్టుని ముందుకు నడిపించాడు. భారీ షాట్లతో విజృంభించాడు. వీళ్లిద్దరు రెండో వికెట్కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి జోడి చూసి.. ఆసీస్ జట్టు భారీ స్కోర్ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే (77 పరుగుల వద్ద) స్టీవ్ స్మిత్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మార్నస్తో కలిసి.. మిచెల్ మంచి పార్ట్నర్షిప్ జోడించాడు. మిచెల్ ఉన్నంతవరకు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. కానీ.. ఎప్పుడైతే అతడు ఔటయ్యాడో, అప్పటినుంచి ఆసీస్ జట్టు పూర్తిగా పట్టు కోల్పోయింది.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
మిచెల్ ఔటయ్యాక.. ఏ ఒక్కరూ సరిగ్గా రాణించలేకపోయారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక, కాసేపు కూడా క్రీజులో నిలకడగా రాణించలేకపోయారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే.. ఏ రేంజ్లో భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈసారి.. ఆసీస్ జట్టుపై మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తాండవం చేశారు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మెరుగైన బౌలింగ్ వేసిన వీళ్లిద్దరూ.. చెరో మూడు వికెట్లు తీశారు. జడేజా కూడా తన స్పిన మాయ చూపించి.. 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హార్దిక్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!