IND vs AUS 1st ODI: భారత బౌలర్ల తాండవం.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Team Got Out For 188 Againt India In First ODI: వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు 188 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదట్లో నిలకడగా రాణించగలిగింది కానీ, ఆ తర్వాతే పట్టు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే 81 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్రీజులో ఉన్నంతవరకు పరుగుల వర్షం కురిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లెవరూ సత్తా చాటలేకపోయారు. మైదానంలోకి అడుగుపెట్టినట్టే పెట్టి.. పెవిలియన్ బాట పట్టారు. ఒకరిద్దరు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించారు కానీ, ఆ తర్వాత వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీంతో.. 35.4 ఓవర్లలోనే 188 పరుగులకి ఆసీస్ జట్టు చాపచుట్టేసింది.
DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
Also Read
- Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
- Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!
- Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. అయితే.. ఆదిలోనే ఆసీస్ జట్టుకి గట్టి దెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ జట్టుని ముందుకు నడిపించాడు. భారీ షాట్లతో విజృంభించాడు. వీళ్లిద్దరు రెండో వికెట్కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి జోడి చూసి.. ఆసీస్ జట్టు భారీ స్కోర్ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే (77 పరుగుల వద్ద) స్టీవ్ స్మిత్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మార్నస్తో కలిసి.. మిచెల్ మంచి పార్ట్నర్షిప్ జోడించాడు. మిచెల్ ఉన్నంతవరకు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. కానీ.. ఎప్పుడైతే అతడు ఔటయ్యాడో, అప్పటినుంచి ఆసీస్ జట్టు పూర్తిగా పట్టు కోల్పోయింది.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
మిచెల్ ఔటయ్యాక.. ఏ ఒక్కరూ సరిగ్గా రాణించలేకపోయారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక, కాసేపు కూడా క్రీజులో నిలకడగా రాణించలేకపోయారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే.. ఏ రేంజ్లో భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈసారి.. ఆసీస్ జట్టుపై మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తాండవం చేశారు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మెరుగైన బౌలింగ్ వేసిన వీళ్లిద్దరూ.. చెరో మూడు వికెట్లు తీశారు. జడేజా కూడా తన స్పిన మాయ చూపించి.. 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హార్దిక్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!