DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna Fires On BRS Govt For Arresting Bandi Sanjay and Etela Rajender: బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. తమ నాయకులతో పోలీసులు వ్యవహరించిన తీరు దౌర్భాగ్యమని మండిపడ్డారు. మహిళా నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. మేము నిరసన తెలపొద్దు కానీ.. మీరు, మీ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణలో, దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చా? అని నిలదీశారు.
Jagga Reddy: గ్రూప్-1 పరీక్షలు వెంటనే రద్దు చేయాలి.. ఇదో పెద్ద స్కామ్
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కాగా.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ గన్పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఈటల కూడా పాల్గొన్నారు. ఈ లీకేజ్పై వాస్తవాలు తెలుసుకునేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్తున్నట్టు బండి సంజయ్ ప్రకటించడంతో.. పోలీసులు గన్ పార్క్ను చుట్టుముట్టారు. అలాగే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటలను అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరికి రక్షణగా కార్యకర్తలు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బండి సంజయ్, ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ని ఖండిస్తూ బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..