YSRTP : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారా ..? |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. మధ్య మధ్యలో జనాలతో మాట్లాడుతూ యాత్ర సాగుతోంది. ఇదే సమయంలో షర్మిల మరో విధంగానూ చర్చల్లోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేస్తారని.. ఇందుకు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారన్నది ఆ చర్చ సారాంశం. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలోనూ ఇలాంటి ప్రచారం సాగినా.. ఇప్పుడు మాత్రం మరింత బలంగా ఆ మాట వినిపిస్తోందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయట. జిల్లాలోని పాలేరు నుంచి షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారని అనుకుంటున్నారట.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాలు మాత్రమే జనరల్. వాటిల్లో కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం ఉన్నాయి. కొత్తగూడెంలో బీసీలకు.. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి, పాలేరులో రెడ్డి సామాజికవర్గానికి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. పాలేరు సెగ్మెంట్ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువసార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్సే. మూడుసార్లు వామపక్షాలు పాగా వేయగా.. ఒకసారి బైఎలక్షన్లో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్కు అక్కడ బలమైన నాయకత్వం లేదన్న వాదన ఉంది. అలాగే YS రాజశేఖర్రెడ్డికి అభిమానులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా లెక్కలేస్తున్నారట. ఆ కారణంగానే YS తనయగా.. షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
YSRTP ఆవిర్భావ సభ కూడా ఖమ్మంలోనే జరిగింది. అప్పుడే షర్మిల, పాలేరు చుట్టూ ప్రచారం సాగింది. అప్పట్లో పాదయాత్రలో భాగంగా నల్లగొండ నుంచి ఖమ్మం వస్తూ పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించారు షర్మిల. ఈ నెల 18న మరోసారి పాలేరు నియోజకవర్గంలో పాదయత్ర చేయబోతున్నారు. నేలకొండపల్లి మీదుగా నల్లగొండ జిల్లాలోకి వెళ్తారట. పాదయాత్రలో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు షర్మిల. పాలేరులో పోటీపై ఈ సమీక్షలో క్లారిటీ వస్తుందా? లేక సంకేతాలు ఇచ్చి సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తారో తెలియదు. YSRTP కార్యకర్తలు మాత్రం షర్మిల అసెంబ్లీకి పోటీ చేసేది పాలేరు నుంచే అని ఘంటా పథంగా చెప్పేస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పాలేరు చుట్టూనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ అంశంపై YS షర్మిల ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!