Off The Record: దామోదరకు చిక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ డిప్యూటీ సీఎమ్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ప్రత్యర్థుల కంటే ఆయనకి ఇంటిపోరే ఎక్కువైందా? అప్పట్లో ఆయనకు భార్య షాకిస్తే…ఇప్పడు తమ్ముడి వంతు వచ్చిందా? ఇంతకీ ఎవరా నేతా? ఏమా సంగతి?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తమ్ముడు ఝలక్ ఇచ్చారా?
దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మాజీ డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన లెక్కలు వేస్తూ.. వ్యూహాలు రచిస్తుంటే.. ఇంట్లో వాళ్లే రాజనర్సింహకు షాక్లపై షాక్లు ఇస్తున్నారు. 2018 ఎన్నికల నాటి పరిణామాలు ఆయన విషయంలో రిపీట్ అవుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ కార్యకర్తలు. గత ఎన్నికల సమయంలో రాజనర్సింహ భార్య షాక్ ఇచ్చారు. ఇప్పుడు రాజనర్సింహకు ఆయన తమ్ముడు ఝలక్ ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉన్నా.. వీటి నుంచి బయట పడటమే ఆయనకు సవాల్గా మారింది.
బీజేపీలోకి దామోదర్ తమ్ముడు
గత ఎన్నికల సమయంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మిని బీజేపీలో చేరారు. భర్త కాంగ్రెస్లో.. భార్య బీజేపీ ఏంటని అప్పట్లో ప్రశ్నలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. మాజీ డిప్యూటీ సీఎం ఇరకాటంలో పడ్డారు. తర్వాత ఏమైందో ఏమో.. ఉదయం కాషాయ కండువా కప్పుకొన్న పద్మిని.. సాయంత్రానికి బీజేపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో రాజనర్సింహ ఓటమికి పద్మిని తీరు కూడా కారణమని పార్టీ వర్గాలు చెప్పుకొన్నాయి. ఇప్పుడంతా బాగుందని.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పక్కాగా ప్లాన్ చేద్దామని రాజనర్సింహ అనుకుంటున్నారట. ఇంతలోనే ఆయన తమ్ముడు రాంచందర్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలోకి వెళ్తున్నారు. ఊరంతా భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
పద్మిని సోదరుడితో పడకే రాంచందర్ జంప్?
దామోదర రాజనర్సింహకు రాంచందర్కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలో దామోదర కార్యకర్తలకు అందుబాటులో లేకపోయినా.. తమ్ముడు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాంటి తమ్ముడు కీలక సమయంలో పార్టీ మారాలని అనుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పద్మిని సోదరునికి దామోదర సోదరుడు రాంచందర్కి పార్టీ వ్యవహారాల్లో కొన్నాళ్లుగా ఇంటిపోరు కొనసాగుతోందట. అందుకే రాంచందర్ పార్టీ మారుతున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గాన్ని కూడా రాంచందర్ ఎంపిక చేసుకున్నట్టు టాక్. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు తనపేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
బీజేపీలో రాంచందర్ చేరిక వాయిదా కూడా చర్చే
బీజేపీలో రాంచందర్ చేరిక నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ఆయన చేరిక వాయిదా పడిందని చెబుతున్నా.. రాంచందర్ బీజేపీ పెద్దలను కలిశారు. అయితే రాంచందర్ చేరిక ఆగడంపైనా జిల్లాలో చర్చగా మారింది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో… ఈ జంపింగ్లు.. ఇంటిపోర్లు మళ్లీ దామోదర రాజనర్సింహను గందరగోళంలో పడేస్తున్నాయట.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!