Off The Record: దామోదరకు చిక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ డిప్యూటీ సీఎమ్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ప్రత్యర్థుల కంటే ఆయనకి ఇంటిపోరే ఎక్కువైందా? అప్పట్లో ఆయనకు భార్య షాకిస్తే…ఇప్పడు తమ్ముడి వంతు వచ్చిందా? ఇంతకీ ఎవరా నేతా? ఏమా సంగతి?
Also Read
తమ్ముడు ఝలక్ ఇచ్చారా?
దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మాజీ డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన లెక్కలు వేస్తూ.. వ్యూహాలు రచిస్తుంటే.. ఇంట్లో వాళ్లే రాజనర్సింహకు షాక్లపై షాక్లు ఇస్తున్నారు. 2018 ఎన్నికల నాటి పరిణామాలు ఆయన విషయంలో రిపీట్ అవుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ కార్యకర్తలు. గత ఎన్నికల సమయంలో రాజనర్సింహ భార్య షాక్ ఇచ్చారు. ఇప్పుడు రాజనర్సింహకు ఆయన తమ్ముడు ఝలక్ ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉన్నా.. వీటి నుంచి బయట పడటమే ఆయనకు సవాల్గా మారింది.
బీజేపీలోకి దామోదర్ తమ్ముడు
గత ఎన్నికల సమయంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మిని బీజేపీలో చేరారు. భర్త కాంగ్రెస్లో.. భార్య బీజేపీ ఏంటని అప్పట్లో ప్రశ్నలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. మాజీ డిప్యూటీ సీఎం ఇరకాటంలో పడ్డారు. తర్వాత ఏమైందో ఏమో.. ఉదయం కాషాయ కండువా కప్పుకొన్న పద్మిని.. సాయంత్రానికి బీజేపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో రాజనర్సింహ ఓటమికి పద్మిని తీరు కూడా కారణమని పార్టీ వర్గాలు చెప్పుకొన్నాయి. ఇప్పుడంతా బాగుందని.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పక్కాగా ప్లాన్ చేద్దామని రాజనర్సింహ అనుకుంటున్నారట. ఇంతలోనే ఆయన తమ్ముడు రాంచందర్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలోకి వెళ్తున్నారు. ఊరంతా భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
పద్మిని సోదరుడితో పడకే రాంచందర్ జంప్?
దామోదర రాజనర్సింహకు రాంచందర్కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలో దామోదర కార్యకర్తలకు అందుబాటులో లేకపోయినా.. తమ్ముడు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాంటి తమ్ముడు కీలక సమయంలో పార్టీ మారాలని అనుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పద్మిని సోదరునికి దామోదర సోదరుడు రాంచందర్కి పార్టీ వ్యవహారాల్లో కొన్నాళ్లుగా ఇంటిపోరు కొనసాగుతోందట. అందుకే రాంచందర్ పార్టీ మారుతున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గాన్ని కూడా రాంచందర్ ఎంపిక చేసుకున్నట్టు టాక్. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు తనపేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
బీజేపీలో రాంచందర్ చేరిక వాయిదా కూడా చర్చే
బీజేపీలో రాంచందర్ చేరిక నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ఆయన చేరిక వాయిదా పడిందని చెబుతున్నా.. రాంచందర్ బీజేపీ పెద్దలను కలిశారు. అయితే రాంచందర్ చేరిక ఆగడంపైనా జిల్లాలో చర్చగా మారింది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో… ఈ జంపింగ్లు.. ఇంటిపోర్లు మళ్లీ దామోదర రాజనర్సింహను గందరగోళంలో పడేస్తున్నాయట.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!