Off The Record: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో హరీష్ రావు ఏం చేయబోతున్నారు..?
- ఐఏఎస్లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్..
- ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్, వెంకటేశ్వర్లు..
- రిపోర్టుపై హరీశ్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్..
- కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల నుంచి నిర్మాణం వరకు ..
- బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం..
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులు..
- కాళేశ్వరం కమిషన్పై సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు..
- కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ఇవ్వాలని వినతి..
Off The Record: కాళేశ్వరం కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు సీనియర్ ఐఏఎస్లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్, వెంకటేశ్వర్లు పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి హరీశ్రావు…సీఎస్ రామకృష్ణారావును కలవడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కోసమే సీఎస్ను కలిసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 60 పేజీల పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై…ఇంతకు ముందే మాజీ మంత్రి హరీశ్రావు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల నుంచి నిర్మాణం వరకు అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Ganja : ఏపీ నుంచి ఢిల్లీకి భారీగా గంజాయి తరలింపు..
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
ఇటీవల మాజీ మంత్రి హరీశ్రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కమిషన్పై కూడా సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే సీఎస్ను కలిసిన హరీశ్రావు…పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ఇవ్వాలని కోరారు. అందుకోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్రావు…ఇద్దరు వేరువేరుగా సీఎస్కు లేఖలు. ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్లు తయారు చేసిన 60 పేజీల నివేదికను స్టడీ చేసి… తర్వాత 665 పేజీల రిపోర్టును స్టడీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు.
Read Also: Surprising Reasons : అది మాల్ అయినా, థియేటర్ అయినా, టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరిగి వాటి నుంచి ధ్రువీకరణ పత్రాలు సంపాదించారు. పీసీ ఘోష్ కమిషన్ తప్పు పట్టిన అంశాలను…మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకే వెళ్లి సమాధానం చెప్పించాలని హరీశ్రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టుల అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాలపై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో జరిగే అసెంబ్లీలో 665 పేజీల నివేదిక ప్రభుత్వం సభ్యులందరికి ఇస్తుందా? 60 పేజీల నివేదికను మరికొంత పెంచి ఇస్తుందా? చూడాలి.
తాజావార్తలు
-
Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
-
Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
-
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
-
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!