Off The Record: టీడీపీ ఆ నేతల విషయంలో అప్పుడు సై సై..! ఇప్పుడు నై నై..?
- విజయనగరం టీడీపీలో అసంతృప్తులు..
- ఇద్దరు ఎన్నారైలు, ఓ వీఆర్ఎస్ ఉద్యోగి..
- పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్న ముగ్గురు..
- శృంగవరపుకోట కోసం అమెరికా నుంచి వచ్చిన గొంప కృష్ణ..
- చీపురుపల్లి కోసం వచ్చిన కిమిడి నాగార్జున..
- వీఆర్ఎస్ తీసుకున్న కోట్ల సుగుణాకర్..
- పార్టీ పెద్దలు మా ముఖం కూడా చూడ్డంలేదని ఆవేదన..
- అనవసరంగా తొందరపడ్డామా అన్న బాధ?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్ కా… న ఘాట్ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్లోకి తీసుకు రావాలంటూ… పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ… ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్లోకి వచ్చి ఆరునెలలైనా… ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు…. విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా…. ఓ జిల్లా స్థాయి అధికారి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారట వాళ్ళు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ…. మేధావులు, ఎన్నారైలకు ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం మొదట్లో జరిగింది. ఆ మేరకు శృంగవరపుకోట నియోజకవర్గం కోసం వచ్చారు గొంప కృష్ణ. స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించి జనంలో ఉండటం కోసం కుటుంబంతో సహా అమెరికా నుంచి దిగిపోయారు ఎన్నారై గొంప. అలాగే అమెరికాలో అన్ని వ్యాపారాలు, ఉద్యోగం వదులుకొని చీపురుపల్లి నియోజకవర్గం నాకే అనుకుంటూ…వచ్చి పార్టీ కోసం పనిచేశారు కిమిడి నాగార్జున. ఇక అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డీడీగా పని చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు కోట్ల సుగుణాకర్. ఈ ముగ్గురూ ఎన్నికలకు ముందు, ఆ టైంలో పార్టీ కోసం గట్టిగానే పని చేశారన్నది స్థానిక నాయకుల మాట.
Read Also: Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!
Also Read
కానీ… ఇప్పుడు మా ముఖం చూడ్డానికి కూడా పార్టీ పెద్దలు ఇష్టపడటం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్నారట ముగ్గురూ. మన పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి… నీకు ఎమ్మెల్సీ గ్యారంటీ అంటూ… అప్పట్లో గొంప కృష్ణకు చెప్పారట. కానీ… ఇప్పుడు ఆ ఊసే లేదంటూ ఆవేదనగా ఉన్నట్టు సమాచారం. ఇక నాగార్జునకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన అధిష్టానం ఇప్పుడు అసలు మాట్లాడడం లేదన్నది ఆయన అనుచరుల మాట. ఇదేం ఖర్మరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారట నాగార్జున అనుచరులు. ఇక కోట్ల సుగుణాకర్కు ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది. అయినా సరే…వీఆర్ఎస్ తీసుకున్నారాయన. వెంటనే టీడీపీ అధినేతను కలిసి తన మనసులో మాట చెప్పారట. ఆయన ఆదేశంతోనే…. పూర్తి స్థాయిలో పార్టీ గెలుపుకోసం పని చేశానని, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సుగుణాకర్. కుటుంబానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందున తొందర పడ్డానని ఇప్పుడు ఫీలవుతున్నారట సుగుణాకర్. పార్టీ అధికారంలోకి రావడం ఆనందంగానే ఉన్నా…. తమను కనీసం పట్టించుకోకుండా… పూచికపుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ముగ్గురూ.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!