Off The Record: టీడీపీ ఆ నేతల విషయంలో అప్పుడు సై సై..! ఇప్పుడు నై నై..?
- విజయనగరం టీడీపీలో అసంతృప్తులు..
- ఇద్దరు ఎన్నారైలు, ఓ వీఆర్ఎస్ ఉద్యోగి..
- పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్న ముగ్గురు..
- శృంగవరపుకోట కోసం అమెరికా నుంచి వచ్చిన గొంప కృష్ణ..
- చీపురుపల్లి కోసం వచ్చిన కిమిడి నాగార్జున..
- వీఆర్ఎస్ తీసుకున్న కోట్ల సుగుణాకర్..
- పార్టీ పెద్దలు మా ముఖం కూడా చూడ్డంలేదని ఆవేదన..
- అనవసరంగా తొందరపడ్డామా అన్న బాధ?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్ కా… న ఘాట్ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్లోకి తీసుకు రావాలంటూ… పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ… ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్లోకి వచ్చి ఆరునెలలైనా… ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు…. విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా…. ఓ జిల్లా స్థాయి అధికారి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారట వాళ్ళు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ…. మేధావులు, ఎన్నారైలకు ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం మొదట్లో జరిగింది. ఆ మేరకు శృంగవరపుకోట నియోజకవర్గం కోసం వచ్చారు గొంప కృష్ణ. స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించి జనంలో ఉండటం కోసం కుటుంబంతో సహా అమెరికా నుంచి దిగిపోయారు ఎన్నారై గొంప. అలాగే అమెరికాలో అన్ని వ్యాపారాలు, ఉద్యోగం వదులుకొని చీపురుపల్లి నియోజకవర్గం నాకే అనుకుంటూ…వచ్చి పార్టీ కోసం పనిచేశారు కిమిడి నాగార్జున. ఇక అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డీడీగా పని చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు కోట్ల సుగుణాకర్. ఈ ముగ్గురూ ఎన్నికలకు ముందు, ఆ టైంలో పార్టీ కోసం గట్టిగానే పని చేశారన్నది స్థానిక నాయకుల మాట.
Read Also: Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!
Also Read
కానీ… ఇప్పుడు మా ముఖం చూడ్డానికి కూడా పార్టీ పెద్దలు ఇష్టపడటం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్నారట ముగ్గురూ. మన పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి… నీకు ఎమ్మెల్సీ గ్యారంటీ అంటూ… అప్పట్లో గొంప కృష్ణకు చెప్పారట. కానీ… ఇప్పుడు ఆ ఊసే లేదంటూ ఆవేదనగా ఉన్నట్టు సమాచారం. ఇక నాగార్జునకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన అధిష్టానం ఇప్పుడు అసలు మాట్లాడడం లేదన్నది ఆయన అనుచరుల మాట. ఇదేం ఖర్మరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారట నాగార్జున అనుచరులు. ఇక కోట్ల సుగుణాకర్కు ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది. అయినా సరే…వీఆర్ఎస్ తీసుకున్నారాయన. వెంటనే టీడీపీ అధినేతను కలిసి తన మనసులో మాట చెప్పారట. ఆయన ఆదేశంతోనే…. పూర్తి స్థాయిలో పార్టీ గెలుపుకోసం పని చేశానని, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సుగుణాకర్. కుటుంబానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందున తొందర పడ్డానని ఇప్పుడు ఫీలవుతున్నారట సుగుణాకర్. పార్టీ అధికారంలోకి రావడం ఆనందంగానే ఉన్నా…. తమను కనీసం పట్టించుకోకుండా… పూచికపుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ముగ్గురూ.
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!