Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!
- బెట్టింగ్ యాప్ రాకెట్లో పాకిస్తాన్ కోణం.. పాక్ జాతీయుడికి చెందినదిగా గుర్తింపు.. మ్యాజిక్విన్కి భారత సెలబ్రెటీల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting App: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్విన్ బెట్టింగ్ యాప్లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి. భారత్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కి ఈ డబ్బు పంపినట్లు తెలుస్తోంది. బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ల నుంచి నటులు,సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మ్యాజిక్విన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు.
Read Also: Iron Rich Fruits: ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.. తప్పక తినండి!
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
ఇప్పటికే నటీనటులు మల్లికా షెరావత్, పూజా బెనర్జీలను ఈడీ ప్రశ్నించింది. ఈ వారాంతంలో మరో ఇద్దరు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు పంపింది. రానున్న వారంలో మరో ఏడుగురు సెలబ్రిటీలకు కూడా సమన్లు అందుతాయని తెలుస్తోంది. మ్యాజిక్విన్ అనేది గేమింగ్ వెబ్సైట్, ఇది దుబాయ్లో ఉంటున్న భారతీయ పౌరులచేత ఆపరేట్ చేయబడుతోంది. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న బెట్టింగ్ గేమ్స్ ఫిలిప్పీన్స్ వంటి బెట్టింగ్ చట్టబద్ధమైన ఇతర దేశాల నుంచి నడుస్తున్నాయని ఈడీ వర్గాలు చెప్పాయి.
గేమ్స్ API ఇతర సోర్సెస్ నుంచి కాపీ చేయబడి మ్యాజిక్విన్లో తిరిగి ప్రసారం అవుతున్నాయని తేలింది. ఈ బెట్టింగ్ యాప్ చాలా సోషల్ మీడియా అకౌంట్స్ని కలిగి ఉంది. వీటిని భారతదేశంలో ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటోంది. ఈ కేసులో గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 67 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, పూణేలలో మ్యాజిక్విన్ కేసుతో సంబంధం ఉన్న 21 మంది వ్యక్తులపై గత వారం ఈడీ దాడులు నిర్వహించి సుమారు రూ.3.55 కోట్లను స్వాధీనం చేసుకుంది. యాప్పై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ చర్యలు తీసుకుంది. పేమెంట్ గేట్వేలు, షెల్ కంపెనీల అగ్రిగేటర్ల ద్వారా బెట్టింగ్ విజేతల డబ్బను వారి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇదే కాకుండా దేశీయ నగదు బదిలీ(డీఎంటీ) ద్వారా కూడా ప్లేయర్లకు డబ్బు పంపబడుతోంది.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!