Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది.. మాజీ క్రికెటర్లు, బోర్డు సభ్యులు.. కోచ్లు.. ఇలా ఎవరో ఒకరు ఈ వ్యవహారంపై మాట్లాడుతూనే ఉంటారు.. అయితే, ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. దీంతో అతని వన్డే భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ జట్టులో కొనసాగుతాడా? అనే ప్రశ్నకు ఇంకా స్పష్టత రాకపోయినా, వచ్చే సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో అతను ఆడనున్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రోహిత్
బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య చర్చల అనంతరం వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రోహిత్కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సిరీస్లో రోహిత్ తన ఫామ్ను కొనసాగించి భారీ స్కోర్లు సాధించాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా 2027 ప్రపంచకప్కు ముందు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ అతనికి కీలకంగా మారనుంది.
Also Read
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
- VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్కు కీలక బాధ్యతలు..?
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
రిటైర్మెంట్పై ఎందుకు ఊహాగానాలు?
ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను తీసుకోవాలనే ఆలోచన సెలెక్టర్లలో ఉందనే వార్తలు వచ్చాయి. లార్డ్స్లో జరిగిన వన్డే రోహిత్కు చివరి మ్యాచ్ కావచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ మ్యాచ్లో రోహిత్ అద్భుత సెంచరీ చేయడంతో రిటైర్మెంట్కు ఇప్పట్లో సిద్ధంగా లేడనే సంకేతాలు వెలువడ్డాయి.
సిరీస్ వారీగా రోహిత్ ప్రదర్శనపై సమీక్ష
రోహిత్ తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించడంతో ఇకపై అతని ప్రదర్శనను సిరీస్ వారీగా సమీక్షించే అవకాశం ఉంది. దీంతో వెస్టిండీస్ సిరీస్లో రోహిత్ ప్రదర్శనపై అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అగార్కర్ భవిష్యత్తుపైనా ఉత్కంఠ
మరోవైపు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. వరుసగా మూడు ప్రధాన ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో అగార్కర్ ఒప్పందాన్ని 2027 ప్రపంచకప్ వరకు పొడిగిస్తారని భావించారు. అయితే శ్రీలంక టెస్ట్ సిరీస్ అనంతరం జరిగే కీలక బీసీసీఐ సమావేశంలో ఆయన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రోహిత్ విషయంలో బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య భిన్నాభిప్రాయాలు?
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ ఉన్నతాధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు జట్టులో మార్పులపై ఆలోచిస్తున్న సమయంలో, బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టులో ఉన్నంతకాలం ఆడుతూనే ఉంటాడని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇంగ్లండ్లో సాధించిన సెంచరీతో రోహిత్ మరోసారి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్లోనూ అదే జోరును కొనసాగిస్తే 2027 ప్రపంచకప్ రేసులో తన అవకాశాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రోహిత్ భవిష్యత్తుపై తుది నిర్ణయం కంటే ముందు అతని బ్యాట్ ప్రదర్శనే కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
-
Sridevi Biography: శ్రీదేవి బయోగ్రఫీని లాంచ్ చేసిన ప్రియాంక .. 300 సినిమాల ప్రయాణం, 150 అరుదైన ఫోటోలతో ‘ఎంప్రెస్’!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!