Off The Record: అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు ఎరుక అన్నట్టు.. ఏకంగా టీడీపీ ఇంచార్జి వ్యవహారాలన్నీ..
- టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మపై తీవ్ర ఆరోపణలు..
- సొంత పార్టీ నేతలే రివర్స్ అవడంపై హాట్ హాట్ చర్చ..
- తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి నియామకం..
- పార్టీ పెద్దల ఎంపికలు సుగుణమ్మకు నచ్చలేదా?..
- వైసీపీ వాళ్ళకు పదవులు అంటూ సుగుణమ్మ వర్గం ప్రచారం?..
- సుగుణమ్మ, ఆమె అల్లుడి అక్రమాలంటూ కేడర్ ఫైర్..
- కార్పొరేషన్ ఎలక్షన్లో ఏడు కోట్లు తీసుకున్నారంటూ బాంబ్..
- సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న టీడీపీ నాయకులు..
- తిరుపతి వైసీపీ నేతల అక్రమాలపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీత..
- పెద్దిరెడ్డి కంపెనీ నుంచి రూ.25 లక్షలు ఎలా వచ్చాయని ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు. ముఖ్యంగా ఇన్చార్జ్ సుగుణమ్మకు రాష్ట్రస్థాయిలో చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది లోకల్ టీడీపీ నేతల మాట. దీంతో… ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం ఓ రేంజ్లో ఆమె మీద రివర్స్ ఎటాక్ చేయడం కలకలం రేపుతోంది. తాజాగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని నియమించారు. ఛైర్మన్ సహా.. సభ్యులను పార్టీ పెద్దలు వడపోసి కూటమి పార్టీ నేతలకీ సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యువనేత మహేష్ యాదవ్ అలియాస్ మక్కి ఛైర్మన్గా 11మంది సభ్యుతో పాలకమండలి నియమించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది.
Read Also: Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
అయితే… ఈ ఎంపిక మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సుగుణమ్మకు నచ్చలేదట… ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా, ఏదో జరిగిపోయినట్టుగా తన అనుచరుల దగ్గర మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అన్యాయం జరిగిందంటూ వరుసగా నిరసనలు, ప్రెస్ మీట్ లు పెట్టించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పైన,పార్టీ పెద్దల మీద విమర్శలు చేయించడంతో పాటు కూటమి ప్రభుత్వంలో వైసిపి నేతలకు పదవులంటూ ఆరోపణలు చేయిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. దీంతో…ఇక లాభం లేదనుకుని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలందరూ ఓ రేంజ్ లో సుగుణమ్మను బహిరంగంగాను, సోషియల్ మీడియాలోను విమర్శిస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా… ఆధారాలతో సహా… గత పదేళ్ళుగా సుగుణమ్మ,అమె అల్లుడు సంజయ్ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారట. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్ లో జిల్లా నేతలు పెద్దిరెడ్డితో, కరుణాకర్ రెడ్డి తో డైరెక్ట్ గా ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థులను విత్ డ్రా చేయించింది నిజమా కాదా? కార్పొరేషన్ ఎలక్షన్లో వైసిపి నుంచి ఏడు కోట్లు తీసుకున్నది నిజమా కాదా? తన మనవరాలు కీర్తిని సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టిచ్చి ఆశీర్వదించమని అభ్యర్థించిన విషయం జగమెరిగిన సత్యమే కదా అంటూ సోషల్ మీడియాలో తమ నాయకురాలిని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు టీడీరీ కార్యకర్తలు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పని చేసిన సుగుణమ్మ ఇప్పుడు మరో డ్రామా తెర తీశారంటూ ఓరేంజ్లో ఫైర్ అవుతున్నారు.
Read Also: The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
అసలు సుగుణమ్మకు వైసీపీ బంధం లేకుంటే… తిరుపతి టి డి ఆర్ బాండ్ల కుంభకోణం గురించి ఎందుకు మెదపడం లేదన్నది కేడర్ క్వశ్చన్. కొండమీద జరిగిన కుంభకోణంలో కరుణాకర్ రెడ్డిని సుగుణమ్మ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె… వైసీపీకి బానిసగానే పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు తిరుపతి తమ్ముళ్లు. గోశాల నుండి రోజుకో వివాదాన్ని భూమన తెరపైకి తెస్తున్నా… ఏ ఒక్క రోజైనా సుగుణమ్మ మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ నుంచి సుగుణమ్మ 25 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ….ఆమె పాత ఎలక్షన్ అఫిడివిట్ను బయటపెట్టారు. ఇంచార్జ్ వర్సెస్ లీడర్స్ మాట అటు ఉంచితే ఆమె అంతలా వారికి పదవి రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేయడానికి కారణం వేరొకటి ఉందని ప్రచారం జరుగుతోంది. గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇప్పిస్తానని స్థానిక నాయకుడి నుంచి సుగుణమ్మ 20 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పుడా వ్యక్తికి కాకుండా వేరొకరికి పోస్ట్ దక్కడంతో… ఆమె మండిపోతూ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే ఇక లాభం లేదనే ఉద్దేశంతోనే డైరెక్ట్ వార్కి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సుగుణమ్మను మౌనంగా ఉండమని చెప్పినప్పటికీ తన అనుచరులతో ప్రెస్ మీట్ లో ధర్నాలు చేయించడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పదవుల పంపకం తిరుపతి తమ్ముళ్ళను రోడ్డుమీదకు వచ్చేలా చేసింది. దీని మీద పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తోరో చూడాలి.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!