Off The Record: హిట్ లిస్ట్లో జోగి రమేష్..! వెంటాడుతున్న ఆ కేసులు ఏంటి..?
- టీడీపీ హిట్ లిస్ట్లో మాజీ మంత్రి జోగి రమేష్..
- చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ మీద..
- అగ్రిగోల్డ్ కేసులో జోగి కొడుకు అరెస్ట్, విడుదల..
- ఇప్పటిదాకా అగ్రిగోల్డ్ కేసులో లేని జోగి పేరు..
- తప్పుడు సర్వే నంబర్తో ప్లాటింగ్ చేసి అమ్మేశారన్న తాజా రిపోర్ట్..
- జోగి రమేష్ పాత్రను నిర్ధారించిన నివేదిక..
- అగ్రి కేసులో ఇక జోగి రమేష్ పేరు చేర్చే అవకాశం..
- 30 ఎకరాలకు అడ్వాన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయలేదన్న ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జోగి రమేష్… మాజీ మంత్రి. వైసీపీ హయాంలో కేబినెట్ మినిస్టర్గా ఉండి కూడా… కనీస హుందాతనం లేకుండా తమ నాయకుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారని, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవన్నది టీడీపీ, జనసేన అభియోగం. చంద్రబాబు, లోకేష్, పవన్ మీద హద్దులు దాటి మాట్లాడటమేగాక… బాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన ఘటనతో పార్టీ హిట్ లిస్ట్లో చేరారాయన. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి పవర్లోకి వచ్చిన వెంటనే సైలెంటయ్యారు జోగి. చంద్రబాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన కేసులో ముందస్తు బెయిల్ వచ్చాకే బయటికి కనిపించారాయన. అదే సమయంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీబీ. తర్వాత అతనికి కూడా బెయిల్ వచ్చింది. అలాగే…. దాడి కేసులో మాజీ మంత్రిని విచారణకు పిలిచి ప్రశ్నించి పంపేసింది సీఐడీ. అది జరిగి కూడా చాలా రోజులు కావడంతో.. పోలీసులు ఇక ఆయన జోలికి రాబోరని అనుకున్నారట. ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయిుంది..
Read Also: Off The Record: వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు..! తోపుదుర్తి ఆ మాట ఎందుకన్నారు ?
Also Read
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
ఇక, జోగి రమేష్ మీద ఫోకస్ పెట్టకపోవచ్చన్న చర్చలు జరిగాయి ఇటు టీడీపీ, అటు వైసీపీలో. కట్ చేస్తే… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం వదల బొమ్మాళీ వదల అంటున్నాయట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన సీన్ లేదని అనుకోవద్దన్నట్టుగా మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇప్పటి వరకు జోగి రమేష్ కుమారుడు రాజీవ్, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు మాత్రమే ఉన్నారు. ఆ కేసులో మాజీ మంత్రి పేరు లేదు. అయితే… ఈ మొత్తం వ్యవహారంపై మళ్ళీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో…. ఏసీబీ, రెవెన్యూ అధికారులు తాజాగా అగ్రిగోల్డ్ భూముల్లో పూర్తిస్థాయి పరిశీలన జరిపారట. ఉద్దేశ పూర్వకంగానే జోగి రమేష్ ఫ్యామిలీ తప్పుడు సర్వే నంబర్తో ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్లాటింగ్ చేసి అమ్మేసినట్టు ఆ పరిశీలనలో తేలిందట. అప్పుడు అధికారంలో ఉన్న జోగి రమేష్ తన పవర్ను అడ్డం పెట్టుకుని అధికారులను ప్రలోభపెట్టి ఇదంతా చేసినట్టు గుర్తించారట. ప్రభుత్వానికి పంపిన రిపోర్ట్లో మాజీ మంత్రి పాత్రను ప్రస్తావిస్తూ…. ఆయన ప్రమేయాన్ని ధృవీకరించినట్టు తెలిసింది.
Read Also: Constable Chiranjeevi: కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్
దీనిపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో…అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగాను అగ్రిగోల్డ్ కేసులో డైరెక్ట్గా జోగిని కూడా చేర్చవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఇక పెడన నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా 2019- 2024 మధ్య పనిచేశారు జోగి రమేష్. అదే సమయంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అప్పుడు కృత్తివెన్నులో 30 ఎకరాల పొలం అమ్ముతానంటూ… రమేష్ తన దగ్గర 90 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారని, కానీ… రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారంటూ… పోలీసులకు ఫిర్యాదు అందింది. తీరా లోతుల్లోకి వెళితే… అది జోగి సొంత భూమి కాదని, ప్రభుత్వ స్థలాన్ని తనదని చెప్పి అమ్ముతానంటూ అడ్వాన్స్ తీసుకున్నట్టు బాధితుడు ప్రసాద్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారట. అలాగే జోగి అనుచరులు అత్యుత్సాహంతో… రోడ్డున పోయే పిల్లాడి దగ్గరున్న సైకిల్ లాక్కుని విరగ్గొట్టిన కేసులో కూడా ఆయన పేరు చేర్చ వచ్చంటున్నారు. వీటితో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా వస్తాయని చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇలా… తాజాగా పరిణామాలతో రమేష్ వ్యవహారాలు ఒక్కొక్కటి తెర మీదకు వస్తుండటంతో ఆయన క్యూలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయవర్గాల్లో. అప్పుడు ప్రశ్నించి వదిలేసినంత మాత్రాన జోగి రమేష్ని వదల్లేదని, పిక్చర్ అభీ బాకీ హై అంటున్నారు టీడీపీ లీడర్స్.
తాజావార్తలు
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?