Off The Record: వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు..! తోపుదుర్తి ఆ మాట ఎందుకన్నారు ?
- కలకలం రేపుతున్న తోపుదుర్తి కామెంట్స్..
- వైసీపీలో వెన్నుపోటుదారులున్నారన్న ప్రకాష్రెడ్డి..
- టీడీపీతో చేతులు కలిపి డ్యామేజ్ చేస్తున్నారని వార్నింగ్..
- క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి హెచ్చరికలు..
- పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలన్న మాజీ ఎమ్మెల్యే..
- రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది మీద చర్యలు..
- రాప్తాడులో ఐదుగురు ఉన్నారన్న ప్రకాష్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తోంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా? లేదా అన్న వాదనల్ని కాసేపు పక్కనపెడితే… అందరి నోట అదే మాట మాత్రం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రామ్ నిర్వహిస్తే… అంతకంటే ముందే… ఆ పార్టీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారాయన. తమ పార్టీలో ఉంటూ…. తెర వెనక తెలుగుదేశంతో చేతులు కలిపి పనులు చేసుకుంటున్నారని, సొంత పార్టీని డ్యామేజ్ చేస్తున్న అలాంటి వారిని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చారాయన. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పేశారు తోపుదుర్తి. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారట మాజీ ఎమ్మెల్యే. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకుని విధివిధానాలు రూపొందించుకున్నారట.
Read Also: Stampede: 6 చోట్ల తొక్కిసలాట.. 175 మంది మృతి..
Also Read
ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వైసీపీని దెబ్బతీయాలనుకుంటున్న వారిలో మార్పు రావాలని, టైం ఇచ్చినా… చెప్పి చూసినా పద్ధతి మార్చుకోని వారి విషయంలో మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అన్నారు తోపుదుర్తి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా…. ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు మారకుండా…అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకుల మీద కూడా చర్యలుంటాయన్నారు తోపుదుర్తి. రాప్తాడు నియోజకవర్గంలో భూమిరెడ్డి మహానంద రెడ్డి, పూలకుంట శివారెడ్డి, కుంటిమద్ది రమేష్, నసనకోట ముత్యాలు, బోయ రాజారాం లాంటి కీలక నేతలపై వేటేసింది పార్టీ. గత ఎన్నికల్లో టీడీపీ నేతలతో చేతులు కలిపి తన ఓటమికి కారణమయ్యారని తోపుదుర్తి ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో…. వాళ్ళ మీద వేటు పడింది.
Read Also: Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!
అంతే కాకుండా తన ఓటమికోసం గతంలో ఇద్దరు నేతలు బలంగా పని చేశారని.. సస్పెండ్ అయిన వారంతా వారితో సన్నిహితంగా మెలిగిన వారేనని చెబుతున్నారాయన. ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఆ కీలక నేతలకేనన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఇద్దరిలో మార్పు వచ్చిందని.. అందుకే వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానానికి లేఖ సమర్పించినట్టు చెప్పారు. కానీ మిగిలిన వారు మాత్రం తమ పద్దతి మార్చుకోకుండా ఇంకా పార్టీలో ఉంటూ టీడీపీతో చేతులు కలిపి ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు . అలాంటి వారు శాశ్వతంగా పార్టీ నుంచి దూరం అవుతారని..వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కీలక నేతలపై కూడా చర్యలు తప్పవంటున్నారు తోపుదుర్తి. మొత్తంగా వెన్నుపోటు పాలిటిక్స్ వైసీపీని కూడా షేక్ చేస్తున్నాయంటున్నారు ఆ పార్టీ ముఖ్యనేతలు.
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?