Shyamala: సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం..? శ్యామల సెటైర్లు..
- మీడియా సమావేశం నిర్వహించిన వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల.
- కూటమి ప్రభుత్వంపై విరుచుకపడ్డ శ్యామల.
- పలు అంశాలపై శ్యామల ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని, నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారంటూ ఆవిడ పేర్కొన్నారు.
Also Read: RK Roja: నగరి ఘటనపై స్పందించిన రోజా
Also Read
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
- Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
అలాగే తల్లికి వందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని, లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆవిడ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ 15 వేలు చొప్పున ఇస్తామన్నారని, రాసి పెట్టుకోమని కూడా చెప్పినట్లు గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని, హామీలు మాత్రం జనంలో ఇచ్చారు అంటూ శ్యామల పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య చెప్తున్నారని, తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలంటూ పేర్కొన్నారు. ఇంకా దీపం పథకం కింద ఇవ్వాల్సిన 4,115 కోట్లు ఎగ్గొట్టారని, కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఎద్దేవా చేసారు.
Also Read: YS Jagan: కూటమి ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు
2025 జనవరి ఫస్ట్ కి జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారని, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదని ఆవిడ అన్నారు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవని అన్నారు. సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. కానీ, చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసిందని శ్యామల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారని, హామీల అమలుపై వైస్సార్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆవిడ ప్రెస్ మీట్ లో తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
-
Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!