Shyamala: సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం..? శ్యామల సెటైర్లు..
- మీడియా సమావేశం నిర్వహించిన వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల.
- కూటమి ప్రభుత్వంపై విరుచుకపడ్డ శ్యామల.
- పలు అంశాలపై శ్యామల ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని, నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారంటూ ఆవిడ పేర్కొన్నారు.
Also Read: RK Roja: నగరి ఘటనపై స్పందించిన రోజా
Also Read
అలాగే తల్లికి వందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని, లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆవిడ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ 15 వేలు చొప్పున ఇస్తామన్నారని, రాసి పెట్టుకోమని కూడా చెప్పినట్లు గుర్తు చేసారు. కానీ, ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని, హామీలు మాత్రం జనంలో ఇచ్చారు అంటూ శ్యామల పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య చెప్తున్నారని, తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలంటూ పేర్కొన్నారు. ఇంకా దీపం పథకం కింద ఇవ్వాల్సిన 4,115 కోట్లు ఎగ్గొట్టారని, కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఎద్దేవా చేసారు.
Also Read: YS Jagan: కూటమి ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు
2025 జనవరి ఫస్ట్ కి జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారని, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదని ఆవిడ అన్నారు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవని అన్నారు. సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. కానీ, చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసిందని శ్యామల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారని, హామీల అమలుపై వైస్సార్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆవిడ ప్రెస్ మీట్ లో తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!