YSRCP: పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: జనసేన అధినేత పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ముద్రగడ కుటుంబాన్ని పార్టీనలో చేర్చుకుని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. వంగా గీతకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించే ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Read Also: GVL Narasimha Rao: కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తా..
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. దానికి తగ్గట్లుగానే జనసేన నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ కూడా అలర్ట్ అయ్యింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే.. బలమైన ప్రత్యర్థిని బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ పిఠాపురం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం కోఆర్డినేటర్గా అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు.
Read Also: YSRCP: వైసీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి
ముద్రగడ పద్మనాభం పవన్కల్యాణ్కు సంబంధించి గురువారం బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముద్రగడ జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని ఆ లేఖ ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుటుంబంలోని ఎవరినైనా బరిలో నిలపాలనే యోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ముద్రగడ కుటుంబ సభ్యులు బరిలో ఉంటే బలమైన పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే వంగా గీతను పిలిపించి పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!