Kurasala Kannababu: ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్!
- ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు
- చంద్రబాబులా మోసం చేయడం జగన్కు చేతకాదు
- చంద్రబాబు, టీడీపీ మోసాల పుట్ట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం అని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. రాష్ట్రంలో వైసీపీ ఎంతో బలంగా ఉంది. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడులా మోసం చేయడం జగన్కు చేతకాదు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారు. సినిమా హీరోలను మించి జగన్కు జనాలు వస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్ధులను చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల్లో ఓడాక టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్ల సమయం పట్టింది, కానీ మా పార్టీ నాయకులకు మూడు నెలల సమయం కూడా పట్టలేదు’ అని కురసాల కన్నబాబు అన్నారు.
Also Read
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
‘8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయింది. చెప్తే చేస్తాడని వైఎస్ జగన్ నిరూపిస్తే.. చంద్రబాబు నాయుడు చెబితే చేయడు అనేది కన్ఫర్మ్ అయ్యింది. చంద్రబాబు, టీడీపీ మోసాల పుట్ట. నారా లోకేష్ చేసింది యువగళం కాదు.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం. రాష్ట్రంలో రెండే పథకాలు అమలు అవుతున్నాయి. ఒకటి చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగా. విశాఖ నుంచి వైసీపీ గళాన్ని గట్టిగా వినిపిస్తాం. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం. జనసేన, టీడీపీలో గెలిచిన చాలా మంది వైసీపీ నుంచి వెళ్లిన వారే. జగనన్న సైన్యం మాత్రం ఎక్కడ చెక్కుచెదరలేదు’ అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!