Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్..
- ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్
- ఈ విషయాన్ని ప్రకటించిన ఢిల్లీ ఫ్రాంచైజీ
- మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ను నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాలరావుతో పాటు ఢిల్లీ కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉంటారు. మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత.. కొన్ని లీగ్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. మునాఫ్ ఐపీఎల్లో కూడా ఆడాడు. 2008 నుండి 2010 వరకు రాజస్థాన్ రాయల్స్, 2011 నుండి 2013 వరకు ముంబై ఇండియన్స్, 2017 సీజన్లో గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో మునాఫ్ సభ్యుడు.
Read Also: Starlink: భారత్లో త్వరలో స్టార్లింక్..? జియో, ఎయిర్టెల్పై ఎఫెక్ట్..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్:
బౌలింగ్ కోచ్గా నియమితులైన తర్వాత జట్టుతో కలిసి పని చేయడం ప్రారంభించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీని ధరించి కనిపించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని ఢిల్లీ ప్రధాన కోచ్గా నియమించింది. జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ ఢిల్లీ జట్టులోకి రానున్నాడు. పాంటింగ్ నిష్క్రమణ తర్వాత, హోప్స్ కూడా జట్టును విడిచిపెట్టాడు.
Read Also: CISF: సీఐఎస్ఎఫ్లో మహిళలు.. మహిళా బెటాలియన్కు కేంద్రం ఆమోదం
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్, అన్క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్లను ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ ఉంచుకుంది. వేలంలో ఢిల్లీకి రూ.73 కోట్ల పర్స్ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ గత మూడు సీజన్లలో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్కు చేరుకోలేకపోయింది.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!