What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
- నేటి నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
- సంస్థాగత ఎన్నికలపై బీజేపీ వర్క్ షాప్
నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు.
నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. 2011 సంవత్సరం తర్వాత మళ్ళీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి.
Also Read
- West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
- Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
పోలీసు అమరవీరుల స్మారకదినోత్సవం పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
నేడు సాయంత్రం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మెళ్లచెర్వులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
నేడు సంస్థాగత ఎన్నికలపై ఢిల్లీలో బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా డాక్టర్ కే లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల అధికారులు, రాష్ట్రాల ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఈ వర్క్ షాప్లో పాల్గొంటారు.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై ఆఫిడవిట్లు సమర్పించిన అధికారులను విచారించేందుకు బహిరంగ విచారణ జరగనుంది. గత విచారణలో పూర్తి కాని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఎంక్వైరీ
విచారణను అర్ధాంతరంగా ముగించి. మళ్లీ విచారణను కొనసాగిస్తామన్న జస్టిస్ ఘోష్. ఈ దఫా విచారణలో ఐఏఎస్లు, విశ్రాంత ఐఏఎస్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈనెల చివరితో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది.
నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!
-
West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
-
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
-
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
-
Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!