TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
- బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
- హరీష్ రావుకు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
- కాళేశ్వరం కూళేశ్వరం అయింది.. టీపీసీసీ నేత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావును ఉద్దేశించి స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా?” అని ప్రశ్నించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ఆస్తులు విలువ తగ్గించిన విధానాన్ని “కంచె చేను మేసినట్లు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
YS Jagan: బాబుగారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఏం నేర్పింది..?
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
అలాగే, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “ఈ సమావేశంపై మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది,” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉందన్న అభియోగాలపై స్పష్టత కోరుతూ, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. “రూ. 1.20 లక్షల కోట్లను ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి అయినా నీరు వచ్చిందా?” అని ప్రశ్నిస్తూ, “కాళేశ్వరం కూళేశ్వరం అయింది” అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక, హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై సెటైర్లు వేస్తూ – “నాలుగు ముక్కలాటలో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావ్ హరీశ్ రావూ?” అని క్విప్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య నడుస్తున్న రాజకీయ నాటకాలను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Karumuri Nageswara Rao: ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు..
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!