Undavalli Arun Kumar: యూనిఫాం సివిల్ కోడ్పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. ఎవరి వైఖరి ఏంటి..?
Undavalli Arun Kumar: యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)పై సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ గురించి దేశం అంతటా చర్చ జరుగుతోంది.. కానీ, యూనిఫాం సివిల్ కోడ్ ను మొదటగా తీసుకుని వచ్చింది బీజేపీ కాదన్నారు. రాజ్యాంగంలోనే డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ లో యూనిఫాం సివిల్ కోడ్ ఉందని గుర్తుచేశారు. ఇక, వెనుకబడిన వర్గాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటుంది.. కానీ, ముస్లింల్లో జనాభా ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారని.. దీని ద్వారా విద్వేషాన్ని పెంచుతున్నారని దుయ్యబట్టారు.
Read Also: Kishan Reddy: ఎట్టకేలకు మౌనం వీడిన కిషన్రెడ్డి.. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
2018లో ప్రధాని నరేంద్ర మోడీ 21వ లా కమిషన్ ను వేశారు.. ఈ కమిషన్ తన నివేదికలో యూనిఫాం సివిల్ కోడ్ ఈ సమయంలో తీసుకుని రావాల్సిన అవసరం లేదని చెప్పిందని గుర్తుచేశారు ఉండవల్లి.. రెండు వారాల కిందట వచ్చిన 22వ లా కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇక, నా చిన్నప్పుడు మేనరికం చేసుకోకపోతే తప్పుగా పరిగణించేవారు.. ఆరోగ్య కారణాల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న ఉండవల్లి.. అయినా కొన్ని చోట్ల మేనరికపు వివాహాలు జరుగుతున్నాయన్నారు. కొన్ని సిక్కు వర్గాల్లో అన్న చనిపోతే మరిది.. వదినను పెళ్ళి చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది.. ముస్లిం సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక కాంట్రాక్టు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి అంటే జన్మజన్మల బంధం.. విడాకులు అనే ప్రస్తావనే లేదు.. మరి యూనిఫాం సివిల్ కోడ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దేశంలో సగటు జనాభా ఆదాయం తగ్గి పోతే… అంబానీలు, అదానీల ఆదాయాలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు ఉండవల్లి.
Read Also: Ponnala: పార్టీలో ఓబీసీ లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి..
ఇక, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు. సిద్ధాంత కాలుష్యం దేశాన్ని చుట్టేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. దీంట్లో నుంచి బయటపడితే కానీ దేశం అభివృద్ధి సాధించదన్నారు. మహాత్మా గాంధీని ఢిల్లీలో ఉదయం అరెస్టు చేస్తే సాయంత్రానికి కేరళ, కన్యాకుమారి లాంటి చోట్ల కూడా బంద్ అమల్లోకి వచ్చేసేది.. మీడియాకు ఉన్న పవర్ అలాందన్నారు. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు ఉండవల్లి.. ఇద్దరే పారిశ్రామిక వేత్తలు కాశ్మీర్ లో ప్రాజెక్టులు చేపట్టారని వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో