TTD EO Dharma Reddy: పార్వేటి మండపం వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలోని పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం.. పాత మండపంలోని శిల్పాలను అలాగే నిర్మించాం.. అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపంలో ఒక్కటి శిధిలావస్థకు చేరుకుంటుంది.. పురాతన మండపంను అదే రాతి స్ధంబాలను ఉంచి నిర్మిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
Read Also: NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునఃనిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే, ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్ధంభాలను ఉపయోగించి, అదే విధంగా నూతనంగా నిర్మిస్తాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అధికారికి లేఖ రాశాం.. టీటీడీకీ సంబందించి రెండు ఆలయాలు మాత్రమే మా పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కటి శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయం రెండు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి.. ఏ వ్యక్తి ఐతే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెప్తున్నారో మేము దాన్ని స్వీకరించాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వచ్చి మండపాలను నిర్మిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. 2019 నుండి సుమారుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత
మరికొద్ది రోజుల్లో 2000 దేవాలయాలు పూర్తి అవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అనేక ఆలయాలను పునఃనిర్మాణం చేసాం, అలాంటి ఆలయాల్లో ఎక్కడ ఇబ్బంది రాలేదు.. కొందరు వ్యక్తులు టీటీడీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలియదు.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించి మండపంను నిర్మిస్తాంమంటే వారికి ఇస్తాం.. స్వార్ధం కోసం మండపాలను నిర్మిస్తామా అని ఆయన ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మండపంను నిర్మించాం.. నవంబర్ 1 నుండి ఇప్పటి వరకూ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదు.. నిరంతరాయంగా చిరుత, ఎలుగుబంటి సంచారంపై నిఘా ఉంచాం.. కాలిబాట మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?