Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీన- మధ్యాష్టమిని నిర్వహించనున్నారు. 10వ తేదీన మతత్రయ ఏకాదశి, 13న మాస శివరాత్రి పండగలను వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Read Also: LEO : అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో జోరు మాములుగా లేదుగా..
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
ఇక, 14 వ తేదీన మహాలయ అమావాస్య పండగను టీటీడీ జరుపుతుంది. అదే రోజున రాత్రి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఆ తర్వాత వేదాంత దేశిక ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19వ తేదీన గరుడ సేవ, 20వ తారీఖు పుష్పక విమానం, సరస్వతి పూజ జరుపనున్నారు.
Read Also: KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్
అయితే, 21వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, 23న చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం పండగలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఇక, 24వ తేదీన పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25 తేదీన మతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం షెడ్యూల్ ను టీటీడీ రిలీజ్ చేసింది. అయితే, 28న పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం మహా సంప్రోక్షణ కార్యక్రమంతో ఆ శ్రీనివాసుడి ఆలయ వాకిళ్లను తెరుస్తారు. 31వ తేదీన చంద్రోదయో వ్రతం జరుపుతారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!