Kolkata doctor murder: దారుణం..ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి ఆపై దారుణ హత్య
- కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో దారుణం
- లేడీ డాక్టర్పై తొలుత అత్యాచారం
- ఆపై దారుణంగా హత్య
- బాధితురాలి శరీరంపై గాయాలు
- ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో పశ్చిమ బెంగాల్లో కూడా రాజకీయం మొదలైంది. ఘటన అనంతరం బీజేపీ నేతలు క్యాండిల్ మార్చ్, నిరసనలు చేపట్టారు.
READ MORE: Sisodia: తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారు..
Also Read
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని బెంగాల్ బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ తెలిపారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సాయంత్రం పోస్టుమార్టం ఎందుకు చేశారని ప్రశ్నించారు? కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సిసిటివి ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆగస్ట్ 9న సంజయ్ రాయ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 31 ఏళ్ల గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని మృతికి సంబంధించిన హత్య కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE:CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి, కేసుపై నిష్పక్షపాత దర్యాప్తును అభ్యర్థించారు. అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో లైంగిక వేధింపులు, హత్యలు జరిగినట్లు తేలింది.
READ MORE:Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
“ఆమె రెండు కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతోంది. ముఖంపై గోళ్ళ గాయాలున్నాయి. ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉంది. ఆమె కడుపు, ఎడమ కాలు… మెడ, కుడి చేయి, .. .పెదవులపై కూడా గాయాలు ఉన్నాయి.”అని నివేదిక పేర్కొంది. కెమెరాలో నిర్వహించిన పోస్ట్మార్టంలో ఇద్దరు మహిళా సాక్షులు, మహిళ తల్లి ఉన్నారు. ఈ నేరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగినట్లు కోల్కతా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!