Revanth Reddy : త్యాగాల పునాదులపై గద్దెనెక్కారు.. దమ్ముంటే రండి చూసుకుందాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుంది.. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుంది.. నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు.. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Uddhav Thackeray: లౌకికవాదం కోసమే వాజ్పేయ్ ప్రధాని అయ్యారు.. హిందుత్వాన్ని విడిచింది మీరా..? మేమా..?
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందేనని ఆయన గుర్తు చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్.. ఇక్కడ ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామిగా ఉంటాడని రేవంత్ రెడ్డి ఆరోపించాడు.
Also Read : All England Open 2023: పీవీ సింధుకి చేదు అనుభవం.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం
అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది.. అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది.. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ తెలిపాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండని ఆరోపించాడు. మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది.. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read : Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..
కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దు.. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది..
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తాం.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించండి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను అడిగారు.
- Tags
- bjp
- BRS
- congress
- revanth reddy
- TPCC
తాజావార్తలు
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!