All England Open 2023: పీవీ సింధుకి చేదు అనుభవం.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu Knocked Out In First Round Of All England Championships: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో.. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండుసార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. చైనాకుకు చెందిన వైఎమ్ ఝాంగ్ చేతిలో ఓటమి పాలైంది. 39 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్లో పీవీ సింధు కనీసం పోరాడలేక.. 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయ్యింది.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రత్యర్థి ఎటాకింగ్ మోడ్లో తన ఆటను కొనసాగించగా.. పీవీ సింధు మాత్రం డీలాగా రాణించింది. ఈ దెబ్బకు ఈ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే వైదొలగాల్సి వచ్చింది. తొలి రౌండ్లోనే పీవీ సింధు ఇలా ఇంటిదారి పట్టడం ఇది మూడోసారి. ఇంతకముందు మలేషియా ఓపెన్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో తొలి రౌండ్లో పివి సింధు చిత్తుగా ఓడింది. అనంతరం ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్లోనే చేతులు ఎత్తేసింది. ఒకప్పుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన తెలుగుతేజం.. ఇప్పుడు తొలి రౌండ్లలనో చేతులు ఎత్తేస్తుండటంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆటతీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పీవీ సింధు పని ఇక అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
మరోవైపు.. బుధవారం జరిగిన మహిళల డబుల్స్లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ పుల్లెల.. థాయ్లాండ్కు చెందిన జోంగ్కోల్పన్ కితిరాకుల్, రావిండా ప్రజొగ్జాంయ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. తొలి రౌండ్ మ్యాచ్లో వారిని 21-18, 21-14 తేడాతో మట్టికరిపించి.. త్రీసా, గాయత్రి ప్రీక్వార్టర్స్కు చేరుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణోయ్లు తొలి రౌండ్ మ్యాచ్ల్లో విజయాలు సాధించి, రెండో రౌండ్కు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!