Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి పాయసం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది. రాగులలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
నెయ్యి:1 టీస్పూన్
రాగి సేమియా: 250 గ్రాములు
నీళ్ళు: 500 మి.లీ
పాలు: 1 లీటరు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జాజికాయ పొడి: చిటికెడు
చిక్కటి/పలచటి కొబ్బరి పాలు: 500 మి.లీ
పాలు/సక్కెర (చక్కెర): 1/2 కప్పు
ఉప్పు:1/2 టీస్పూన్
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
గార్నిషింగ్ కోసం:
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు:4 టేబుల్ స్పూన్లు
కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, రాగి సేమియా వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. అందులో 500 మి.లీ నీళ్ళు పోసి, రాగి సేమియా నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు బాగా మరిగేంత వరకు ఉంచాలి. మంట తగ్గించి 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు కలిపి, మరొక పొంగు వచ్చే వరకు ఉంచాలి. పాయసం మెల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు పంచదార, చిటికెడు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చిన్న మూకుడులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలను వేయించాలి. చివరిగా కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పాయసంలో కలపాలి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి సేమియా పాయసాన్ని వేడిగా అయినా లేదా చల్లార్చి ఫ్రిజ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు!
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!