Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 10 01 2025

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :January 10, 2025 , 9:16 am
By Gogikar Sai Krishna
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ
  • గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?
  • గుడ్‌న్యూస్.. బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు ప్రభుత్వం సంక్రాంతి కానుక..
  • నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!

టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ 2025 షెడ్యూల్‌ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్‌ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్‌ వైల్డ్‌ కార్డుతో గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెల్చుకున్న జొకో ముందు బసవారెడ్డి ఎలా నిలబడనున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిశేష్‌ బసవారెడ్డి తల్లిదండ్రులు మురళీకృష్ణ, సాయిప్రసన్నలది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. 1999లో మురళీకృష్ణ అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో జన్మించిన నిశేష్‌కు టెన్నిస్‌ అంటే చిన్నప్ప్పటి నుంచి ఇష్టం. తల్లిదండ్రులు కూడా అతడిని ప్రోత్సహించారు. అమెరికా స్టార్‌ ఆటగాడు రాజీవ్‌ రామ్‌, కోచ్‌ బ్రయాన్‌ స్మిత్‌ మార్గనిర్దేశనంలో నిశేష్‌ ఆటపై మంచి పట్టు సాధించాడు. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ నిశేష్‌ సత్తా చాటుతున్నాడు. 2022లో ఒజాన్‌ బారిస్‌తో కలిసి యుఎస్‌ ఓపెన్‌ బాలుర డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.

కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మద్య గొడవల కారణంగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ కోసం శంషాబాద్ వచ్చారు.

నేడు హష్‌ మనీ కేసులో ట్రంప్‌కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్..

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఈరోజు (జనవరి 10) శిక్ష విధిస్తామని ఇప్పటికే న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే, నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని పేర్కొన్నారు. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్‌ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ కోరారు. అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడి పిటిషన్ ను తిరస్కరించింది.

ఘోరం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం.. నుజ్జును నుజ్జైంది. తెల్లవారు జామున 3.30 – 4.00 గంటల మధ్యలో జరిగిన దుర్ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ, రూరల్ సీఐ, చివ్వేంల ఎస్ఐ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ టైర్
పేలడంతో పక్కకు ఆపినట్లు డ్రైవర్ తెలిపాడు.

నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ క్రమంలో, రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.

గుడ్‌న్యూస్.. బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు ప్రభుత్వం సంక్రాంతి కానుక..

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్కర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌లు మారుస్తూ జీవో తెచ్చినట్లు తెలిపారు.

ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి ఘటన నిందితుడికి ఉరిశిక్ష..?

పశ్చిమ బెంగాల్‌ ఆర్జీ కార్‌ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది. ఈ కేసులో జనవరి 18వ తేదీన కోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్‌ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తరపున లాయర్లు వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపారు. దానికి బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్‌, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే ఇందుకు సాక్ష్యం అని వెల్లడించారు.

భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు.. గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్నా నేపథ్యంలో..
వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. పదిరోజుల పాటు సాగనున్న వైకుంఠ దర్వానాల కోసం వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు, ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారని సమాచారం.

వైకుంఠ ఏకాదశి సందర్భమంటే, అన్ని దేవాలయాలు చాలా అందంగా ముస్తాబు అవుతున్నాయి. ప్రఖ్యాత వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం తెరుచుకొని, భక్తులు వేగంగా దేవాలయానికి వెళ్లేందుకు క్యూ కట్టుతున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు ఈ దివ్య దర్శనాన్ని పొందేందుకు ఆసక్తిగా ఉన్నారు. శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు వేకువజామున నుండే భక్తులు అనేక సంఖ్యలో గల బారులు తీరి ఉన్నారు. కాగా భద్రాచలం ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు, అక్కడ ఉత్తర ద్వారము ద్వారా శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనమిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమించాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Game Changer
  • telugu news
  • Top Headlines @9AM
  • top news vaikuntha ekadashi

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions