Chilakaluripet Accident: చిలకలూరుపేట వద్ద ఘోరం.. టిప్పర్- బస్సు ఢీ.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tipper Collided Private Travel Bus In Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు – టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు – టిప్పర్ ఢీ కొవడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారని పేర్కొన్నారు.
Read Also: Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బాపట్ల జిల్లా చిన్న గంజం మండలం నీలాయిపాలెం వాసులుగా గుర్తించారు.. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం మరో 32 మందికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చిలకలూరి పేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
Read Also: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడిన వారిని పోలీసులు తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎన్టీవీతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజ్యలక్ష్మి, సాయి కుమార్ మాట్లాడుతూ.. నిద్రమత్తులో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది అని చెప్పారు. వెంటనే డ్రైవర్ సీటు పక్కన ఉన్న ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు వచ్చామన్నారు. క్షణాల్లోనే బస్సులో మంటలు అంటుకున్నాయి.. కొంత మంది బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు వచ్చారు.. కొందరికి బస్సులో మంటలు వ్యాపించడంతో బయటకు రావటం సాధ్యం కాలేదు.. అర్థరాత్రి దాటిన తర్వాత గంట సమయంలో ప్రమాదం జరిగింది.. 108కి ఫోన్ చేస్తే వాళ్ళు, స్థానికులు వచ్చి సాయం చేశారు.. హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి హైద్రాబాద్ వెళ్తుండగా ఇలా జరిగింది అని బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులు చెప్పారు.
మృతుల వివరాలు:-
1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
5. చిలకలూరి పేట ప్రమాద ఘటనలో మత్యు వాత పడ్డ టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్ కు చెందిన హరిసింగ్ గా గుర్తింపు.
6. మరోకరి వివరాలు తెలియ రాలేదు.
తాజావార్తలు
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!