Chilakaluripet Accident: చిలకలూరుపేట వద్ద ఘోరం.. టిప్పర్- బస్సు ఢీ.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tipper Collided Private Travel Bus In Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు – టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు – టిప్పర్ ఢీ కొవడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారని పేర్కొన్నారు.
Read Also: Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బాపట్ల జిల్లా చిన్న గంజం మండలం నీలాయిపాలెం వాసులుగా గుర్తించారు.. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం మరో 32 మందికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చిలకలూరి పేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
Read Also: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడిన వారిని పోలీసులు తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎన్టీవీతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజ్యలక్ష్మి, సాయి కుమార్ మాట్లాడుతూ.. నిద్రమత్తులో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది అని చెప్పారు. వెంటనే డ్రైవర్ సీటు పక్కన ఉన్న ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు వచ్చామన్నారు. క్షణాల్లోనే బస్సులో మంటలు అంటుకున్నాయి.. కొంత మంది బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు వచ్చారు.. కొందరికి బస్సులో మంటలు వ్యాపించడంతో బయటకు రావటం సాధ్యం కాలేదు.. అర్థరాత్రి దాటిన తర్వాత గంట సమయంలో ప్రమాదం జరిగింది.. 108కి ఫోన్ చేస్తే వాళ్ళు, స్థానికులు వచ్చి సాయం చేశారు.. హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి హైద్రాబాద్ వెళ్తుండగా ఇలా జరిగింది అని బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులు చెప్పారు.
మృతుల వివరాలు:-
1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
5. చిలకలూరి పేట ప్రమాద ఘటనలో మత్యు వాత పడ్డ టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్ కు చెందిన హరిసింగ్ గా గుర్తింపు.
6. మరోకరి వివరాలు తెలియ రాలేదు.
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!