AP Crime: వాడపల్లి ఆలయానికి వెళ్తుండగా విషాదం.. గోదావరిలో మునిగిన ముగ్గురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాడపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ఆలమూరు మండలం చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి గౌతమీ గోదావరి నదిలోనే కాలినడకన నడిచి వెళ్తుండగా.. వాడపల్లి లంక వద్ద దొంగ ఊబిలో కూరుకుపోయి మునిగి మృతి చెందారు. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రతి శనివారం దర్శనం చేసుకుని మెక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితే. ఏడు శనివారాలు వరుసగా దర్శనం చేసుకునే సంప్రదాయం ఈ ఆలయంలో కొనసాగుతుంది.
Read Also: Pavitra : తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..
Also Read
అయితే, వేసవి కావడంతో గోదావరిలో నీరు పెద్ద గా ప్రవాహం లోకపోవడంతో కాలినడకన గోదావరిలో వాడపల్లి గుడికి వెళ్లడం ఈ ప్రాంతం వారు చేస్తుంటారు. ఇది ఈ ప్రాంతం వారికి అలవాటే.. అయితే, మోకాలు లోతు పైగా నీరు అక్కడక్కడ ప్రవహిస్తూ వుంటుంది. ఆలమూరు మండలం బడుగువానిలంక ఇవతలి ఒడ్డు అయితే అవతలి ఒడ్డు వాడపల్లి ఆలయం వుంటుంది. దీనితో అటు రావులపాలెం నుంచి తిరిగి వెళ్ళనక్కర్లలేకుండా దగ్గర మార్గంగా కొందరు కాలినడకన గోదావరి దాటి వెళ్తుంటారు. అలా శనివారం వేకువజామున ముగ్గురు మహిళలు కలిసి వెళుతుండగా గోదావరి మధ్యలో ఊబిలో. ప్రమాదవశాత్తు చిక్కుకుని కిందకు ఒకరి తర్వాత ఒకరు కూరుకుపోయారు. ఒకర్ని రక్షించబోయి ఒకరు ముగ్గురు కూడా ఊబిలోకి కూరుకుపోయి మృతి చెందినట్టు అక్కడ పరిస్థితులు బట్టి తెలుస్తోంది.
Read Also: Indonesia: కారు, బైకులను ఢీకొన్న స్కూల్ బస్సు.. 11 మంది మృతి
వీరు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో అనంతలక్ష్మీ అనే మహిళ మృతదేహం ముందుగా లభ్యం అయ్యింది. నిన్న రాత్రి వరకూ వాడపల్లి వెళ్లిన వారు రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వాడపల్లి వెళ్లి నిన్న పొద్దుపోయాక ఆరా తీస్తే అక్కడ తెలిసిన వారు రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గొదావరి మార్గంలో వెతగగా గొదావరి ఊబిలో కోరుకుపోయినట్టు స్థానికుల సమాచారంతో నేటి వేకువజామున తెలుసుకుని. ఆత్రేయపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆదివారం ఉదయం మృతదేహాలు వెలికితీసే చర్యలు చేపట్టారు. ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన పల్లూరి సత్య అనంతలక్ష్మి( 40) కప్పిరెడ్డి ఏసమ్మ ( 60 ) కర్రీ సునీత (16) లు గా గుర్తించారు. వాడపల్లి లంక సమీపంలో ఘటన జరిగింది. మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాజావార్తలు
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!