AP Crime: వాడపల్లి ఆలయానికి వెళ్తుండగా విషాదం.. గోదావరిలో మునిగిన ముగ్గురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాడపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ఆలమూరు మండలం చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి గౌతమీ గోదావరి నదిలోనే కాలినడకన నడిచి వెళ్తుండగా.. వాడపల్లి లంక వద్ద దొంగ ఊబిలో కూరుకుపోయి మునిగి మృతి చెందారు. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రతి శనివారం దర్శనం చేసుకుని మెక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితే. ఏడు శనివారాలు వరుసగా దర్శనం చేసుకునే సంప్రదాయం ఈ ఆలయంలో కొనసాగుతుంది.
Read Also: Pavitra : తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
అయితే, వేసవి కావడంతో గోదావరిలో నీరు పెద్ద గా ప్రవాహం లోకపోవడంతో కాలినడకన గోదావరిలో వాడపల్లి గుడికి వెళ్లడం ఈ ప్రాంతం వారు చేస్తుంటారు. ఇది ఈ ప్రాంతం వారికి అలవాటే.. అయితే, మోకాలు లోతు పైగా నీరు అక్కడక్కడ ప్రవహిస్తూ వుంటుంది. ఆలమూరు మండలం బడుగువానిలంక ఇవతలి ఒడ్డు అయితే అవతలి ఒడ్డు వాడపల్లి ఆలయం వుంటుంది. దీనితో అటు రావులపాలెం నుంచి తిరిగి వెళ్ళనక్కర్లలేకుండా దగ్గర మార్గంగా కొందరు కాలినడకన గోదావరి దాటి వెళ్తుంటారు. అలా శనివారం వేకువజామున ముగ్గురు మహిళలు కలిసి వెళుతుండగా గోదావరి మధ్యలో ఊబిలో. ప్రమాదవశాత్తు చిక్కుకుని కిందకు ఒకరి తర్వాత ఒకరు కూరుకుపోయారు. ఒకర్ని రక్షించబోయి ఒకరు ముగ్గురు కూడా ఊబిలోకి కూరుకుపోయి మృతి చెందినట్టు అక్కడ పరిస్థితులు బట్టి తెలుస్తోంది.
Read Also: Indonesia: కారు, బైకులను ఢీకొన్న స్కూల్ బస్సు.. 11 మంది మృతి
వీరు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో అనంతలక్ష్మీ అనే మహిళ మృతదేహం ముందుగా లభ్యం అయ్యింది. నిన్న రాత్రి వరకూ వాడపల్లి వెళ్లిన వారు రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వాడపల్లి వెళ్లి నిన్న పొద్దుపోయాక ఆరా తీస్తే అక్కడ తెలిసిన వారు రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గొదావరి మార్గంలో వెతగగా గొదావరి ఊబిలో కోరుకుపోయినట్టు స్థానికుల సమాచారంతో నేటి వేకువజామున తెలుసుకుని. ఆత్రేయపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో ఆదివారం ఉదయం మృతదేహాలు వెలికితీసే చర్యలు చేపట్టారు. ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన పల్లూరి సత్య అనంతలక్ష్మి( 40) కప్పిరెడ్డి ఏసమ్మ ( 60 ) కర్రీ సునీత (16) లు గా గుర్తించారు. వాడపల్లి లంక సమీపంలో ఘటన జరిగింది. మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!